గడిచిన ప్రచారంలో పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేస్తామంటూ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్న మాటలు ఎంతటి దుమారాన్ని రేపాయో మనము చూసాము. అయితే బండి సంజయ్ అంత ఆషామాషీగా ఈ మాటలు అనలేదని మనము అర్ధం చేసుకోవాలి. ఇక్కడ బండి సంజయ్ హిందుత్వమనే ఫార్ములాని ఉపయోగించాడని క్లియర్ గా అర్ధమవుతూ ఉంది. దేశ సమగ్రత ను కాపాడడానికి బీజేపీ ఎంత దూరమైనా వెళుతుందని ప్రజలకు చెప్పడానికి అలాగే తెలంగాణ హిందువులలో కదలిక తీసుకురావడానికి ఈ ఎత్తుగడ వేశారు.
ఇదేవిధంగా మజ్లీస్ పార్టీ కూడా ముస్లిమ్స్ సెంటిమెంటును బలంగా నమ్ముకుని ఈ ఎన్నికలకు వెళుతోంది. ఈ సెంటిమెంట్ వారిని హైద్రాబాదు నుండి కాశ్మీర్, వెస్ట్ బెంగాల్ బీహార్ రాష్ట్రాలలో సీట్లను గెలిచేలా చేసింది. ఇప్పుడు దక్షిణ రాష్ట్రాలలో పాగా వేయాలని చూస్తున్న బీజేపీ కి హిందువుల సెంటిమెంట్ ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియదు. మరి డిసెంబర్ 1 న జరగనున్న గ్రేటర్ ఎన్నికలలో తెరాస తన పరువును నిలబెట్టుకుంటుందా, లేదా బీజేపీ మరింత పుంజుకోనుందా తెలియాలంటే ఫలితాల వరకు ఆగాలి.