భారత దిగ్గజ ఆటగాడు ప్రస్తుతం భారత క్రికెట్ నియంత్రణ మండలి చైర్మన్ సౌరవ్ గంగూలీకి ఇటీవలే అస్వస్థతకు గురయ్యారు అనే విషయం తెలిసిందే.  హార్ట్ ఎటాక్ రావడంతో ఇక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు సౌరవ్ గంగూలి. సౌరవ్ గంగూలీ కి ఇటీవలే బైపాస్ సర్జరీ కూడా జరిగింది.  అయితే ఒక్కసారిగా సౌరవ్ గంగూలీకి హార్ట్ఎటాక్ వచ్చి ఆస్పత్రి పాలు కావడంతో అభిమానులు అందరూ ఎంతగానో ఆందోళన చెందారు అని చెప్పాలి. అయితే మొన్నటి వరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్న సౌరవ్ గంగూలీకి ఉన్నఫలంగా హార్ట్ ఎటాక్ రావడానికి గల కారణం ఏంటి అన్నది ప్రస్తుతం ఆసక్తి కరం గా మారిపోయింది.


 ఈ క్రమంలోనే భారత క్రికెట్ నియంత్రణ మండలి చైర్మన్ సౌరవ్ గంగూలీకి హార్ట్ ఎటాక్ రావడం పై అటు కొన్ని కొన్ని రాష్ట్రాలలో రాజకీయ పార్టీల నేతలు  కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి.  రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే సౌరవ్ గంగూలీకి హార్ట్ ఎటాక్ వచ్చింది అంటూ విమర్శలు చేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే సౌరవ్ గంగూలీ కి హార్ట్ ఎటాక్ వచ్చిందని పశ్చిమబెంగాల్ సిపిఎం నేత అశోక్ భట్టాచార్య సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఈయన చేసిన ఆరోపణలు కాస్త ప్రస్తుతం కొత్త చర్చకు దారితీస్తున్నాయి.



 అయితే మరికొన్ని రోజుల్లో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో సౌరవ్ గంగూలీ కి ఉన్న క్రేజ్ ను ఉపయోగించుకోవాలని కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఇందుకోసమే తమతో కలిసి నడవాలని సౌరవ్ గంగూలీ పై ఒత్తిడి తీసుకు వస్తున్నాయి అంటూ అశోక్ భట్టాచార్య సంచలన ఆరోపణలు చేశారు.  ఇలా రాజకీయ ఒత్తిడి పెరిగి పోవడం కారణంగానే సౌరవ్ గంగూలీకి గుండెపోటు వచ్చింది అంటూ ఆరోపించారు. రాజకీయాలకు రావొద్దు అంటూ గత వారమే సౌరవ్ గంగూలీకి సూచించానని దీనిపై సౌరవ్ గంగూలీ కూడా అనుకూలంగా స్పందించాడు అంటూ చెప్పుకొచ్చాడు అశోక్ భట్టాచార్య.

మరింత సమాచారం తెలుసుకోండి: