సాధారణంగా సినిమాల ప్రభావం జనాలపై ఎక్కువగా ఉంది అని అంటూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో తెరమీదికి వస్తున్న కొన్ని ఘటనలు చూస్తుంటే మాత్రం మరి ఇంతలా సినిమాల ప్రభావం ఉంటుందా అని ఆశ్చర్య పోక తప్పదు.  ఇలాంటి ఆశ్చర్యకర సంఘటన ఇక్కడ జరిగింది.  సాధారణంగా అందరు  దృశ్యం సినిమా చూసే ఉంటారు. ఇక ఈ సినిమాలో ఒక వ్యక్తిని హత్య చేసిన తర్వాత పోలీసులకు దొరకకుండా ఉండేందుకు వెంకటేష్ అతని కుటుంబం మొత్తం వేసే ప్లాన్లు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి.  ఇక్కడ ఒక వ్యక్తి దృశ్యం సినిమా చూసి మరీ ఎక్కువగా ప్రభావితం అయినట్లున్నాడు.


 నిజజీవితంలో కూడా ఇలాంటిది  ప్రయత్నించాడు. తన ప్రియురాలి అత్యంత కిరాతకంగా హత్య చేసి మృతదేహాన్ని తన ఇంట్లోనే దాచిపెట్టాడు.  ఈ ఘటన చివరికి వెలుగులోకి రావడంతోఅందరూ ఒక్కసారిగా షాకయ్యారు మహారాష్ట్రలోని పాల్ ఘర్  జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.  సూరజ్ అనే వ్యక్తికి ..  అమిత మొహితే అనే యువతితో ఆరేళ్ల క్రితం పరిచయం ఉంది. వారిద్దరూఎన్నో రోజుల నుంచి ప్రేమలో మునిగి తేలుతున్నారు.  ఈ క్రమంలోనే వీరి రిలేషన్ కు కుటుంబ సభ్యులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గత ఏడాది అక్టోబర్ నెలలో వీరి వివాహం నిశ్చయమైంది.



 ఈ క్రమంలోనే అక్టోబరు 21వ తేదీన తన పెళ్లి కోసం ప్రియుడితో కలిసి షాపింగ్ కి వెళ్తున్నాను అంటూ యువతిని ఇంట్లో చెప్పి వెళ్ళింది.  ఇక ఆ తర్వాత ఎంతకీ యువతి మాత్రం ఇంటికి రాలేదు దీంతో కుటుంబ సభ్యులు ఆమెకు  ఫోన్ చేసిన ఫోన్ స్విచాఫ్ వచ్చింది. దీంతో కంగారుపడి పోయినా యువతి తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇక అప్పటి నుంచి సూరజ్ పోలీసుల నుంచి తప్పించుకు తిరగడం మొదలుపెట్టాడు. ఇటీవలే సదరు యువతి యొక్క సోదరుడు సూరజ్  ను గమనించి వెంబడించి పట్టుకున్నాడు. అనంతరం పోలీసులకు అప్పగించడంతో  పోలీసులు తమదైన శైలిలో విచారించగా ఒప్పుకున్నాడు. యువతి ని చంపి బిల్డింగులో  యువతి మృతదేహాన్ని పెట్టి  గోడ కట్టాను అంటూ చెప్పడంతో పోలీసులు సైతం షాకయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: