కేంద్ర ప్రభుత్వం అన్నదాతల కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిది యోజన పథకాన్ని తీసుకొచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ పథకం కింద ప్రతి ఏడాది రూ.6వేల రూపాయలను మూడు విడతల్లో రైతుల ఖాతాలో జమ చేస్తుంది ప్రభుత్వం. రైతులకు సంవత్సరానికి మూడు విడతల్లో రూ.2 వేలు అందుతాయి. అయితే పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన అనేది చిన్న, ఉపాంత రైతుల సామాజిక భద్రత కోసం తీసుకొచ్చిన ప్రభుత్వ పథకం. 18 నుండి 40 సంవత్సరాల వయస్సులోపు 2 హెక్టార్ల వరకు సాగు చేయగల భూములను కలిగి ఉన్న చిన్న, ఉపాంత రైతులు ఈ పథకం కింద ప్రయోజనం పొందటానికి అర్హులు.

అయితే పిఎం కిసాన్ యోజన ద్వారా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మొత్తం 7 వాయిదాల్లో రైతులకు నగదు బదిలీ చేసింది. త్వరలో 8 వ విడత బదిలీకి సిద్ధంగా ఉంది. ఈ పథకం పాత విధానంలో ప్రభుత్వం కొన్ని మార్పులు చేయబోతోంది. ఇప్పుడు పిఎం కిసాన్ సమ్మన్ పథకం ప్రయోజనం వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే ఇవ్వబడుతుంది. మార్చి నెలలో ఈ డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి చేరొచ్చని తెలుస్తోంది. నివేదికలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి.

అయితే బెనిఫీసియరీ లిస్ట్‌లో మీ పేరు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. లిస్ట్‌లో పేరు లేకపోతే డబ్బులు రావు. ఉంటేనే డబ్బులు వస్తాయి. దీని కోసం మీరు పీఎం కిసాన్ వెబ్‌సైట్‌కు వెళ్లాలి. మీకు ఫార్మర్స్ కార్నర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేసి బెనిఫీషియరీ లిస్ట్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఇక ఇప్పుడు మీ రాష్ట్రం, జిల్లా, ఊరు పేరు ఎంటర్ చేసి మీ పేరు లిస్ట్‌లో ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఇంకా మీరు పీఎం కిసాన్ స్కీమ్‌లో చేరి ఉండకపోతే.. ఇప్పుడు కూడా ఆన్‌లైన్‌లోనే ఈ పథకంలో చేరొచ్చు. దీని కోసం మీ బ్యాంక్ అకౌంట్, పొలం పాస్‌బుక్, ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: