అంతే కాదు.. వీళ్లుకేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని చూసుకుని రాష్ట్రంలో అందరినీ బెదిరించి బతకడానికి అలవాటు పడిపోయారని నేరుగానే విమర్శించారు. పనిలో పనిగా సోము వీర్రాజుపైనా ఆర్కే ఘాటు వ్యాఖ్యలు రాసుకొచ్చారు ఆర్కే. ఏ తప్పూ చేయకపోయినా ద్వేషంతో రగిలిపోతున్న వీర్రాజు క్షమాపణ కోరడంలో ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదని.. అందుకే ఆయన హెచ్చరికలను మేం పరిగణనలోకి తీసుకోవడం లేదని చెప్పేశారు. అంతేకాదు, ఆంధ్రజ్యోతి గ్రూపు సంస్థలకు అన్యాయంగా దురుద్దేశాలను పదే పదే ఆపాదిస్తున్న ఆ నలుగురి విషయంలో మేం కూడా ఎలా ఉండాలో అలాగే ఉంటామని వార్నింగ్ ఇస్తున్నారు.
అసలు వీర్రాజు తనను గానీ, తాను ఆయనను గానీ ఎప్పుడూ కలుసుకోలేదంటున్నారు ఆర్కే. అయినా, తనపై ద్వేషం ఉందంటే కారణం కులద్వేషమే కావచ్చని తానే ఓ అంచనాకు వస్తున్నారు ఆర్కే. అందుకు నేను చేయగలిగింది కూడా ఏమీ లేదంటున్నారు. ఏదేమైనా వీర్రాజు అండ్ కో హెచ్చరికలకు, బహిష్కరణలకు మేం భయపడమంటున్నారు ఆర్కే. బీజేపీలోని ఆ నలుగురు ఈ విషయం తెలుసుకుంటే మంచిదంటున్నారు.
మొత్తానికి ఆంధ్రజ్యోతికీ- ఏపీ బీజేపీకీ బాగానే లడాయి జరిగేలా ఉంది. ఇప్పటికే ఆంధ్రజ్యోతి మీడియాను బహిష్కరిస్తున్నామని ఏపీ బీజేపీ ప్రకటించింది. ఇప్పుడు ఆర్కే బీజేపీనేతలే టార్గెట్గా కథనాలు రాస్తున్నారు. చూడాలి.. ఈ వివాదం ఎక్కడి వరకూ వెళ్తుందో..?