ఇక హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ ఆకట్టుకునేందుకు దళిత బందు అనే పథకాన్ని ప్రవేశపెట్టారు ఇక ఈ పథకం ద్వారా దళితులు అందరికీ కూడా పది లక్షల రూపాయలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది ఈ పథకం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం గా మారిపోయింది. అదే సమయంలో హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి కూడా కోట్ల రూపాయలను కేటాయిస్తూ ప్రజల వైపు ఆకర్షించేందుకు టిఆర్ఎస్ పార్టీ సర్వ ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాదు వివిధ పార్టీలు కీలక నేతలు అందరిని కూడా తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే ఈటెల అనుచరుడుగా ఉన్న ఒక వ్యక్తికి టీఆర్ఎస్ కీలక పదవి కట్టబెట్టింది.
ఇటీవలే కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇలా కెసిఆర్ వ్యూహాలను అమలు చేస్తున్నారు. అయితే తాజాగా దీనిపై స్పందించిన తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఏకంగా మగధీర సినిమాలోని రామ్ చరణ్ డైలాగ్ చెప్పి అభిమానులందరిలో హుషారు నింపారు. ఒక్కొక్కరిని కాదు కెసిఆర్..100 మందిని తీసుకు పో.. ఎంతమందిని తీసుకుపోయిన హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు మాత్రం ఆపలేరు అంటూ బండి సంజయ్ డైలాగ్ చెప్పారు. ఒక బీజేపీ కార్యకర్త అందరిలో స్ఫూర్తి నింపుతాడు అని 100 మందితో ఓటు వేయించి భారీ మెజారిటీతో గెలిపిస్తాడని అంటూ వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది.