ఎన్నో దశాబ్దాల నుంచి భారతీయ ప్రజల నమ్మకాన్ని కూడగట్టుకొని ప్రస్తుతం భీమారంగంలో దిగ్గజ బీమా రంగ సంస్థగా కొనసాగుతుంది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ప్రస్తుతం ఎన్నో కొత్త బీమా సమస్యలు వచ్చినప్పటికీ అటు ప్రజల్లో మాత్రం ఎల్ఐసి పై ఉన్న నమ్మకం మాత్రం చెక్కు చెదరలేదు. ఎప్పటికప్పుడు తమ పాలసీదారుల అవసరాలకు అనుగుణంగా ఎన్నో రకాల పాలసీలను తీసుకు వస్తూ ఉంటుంది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్.  పిల్లల చదువుల కోసం వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కోసం..  ఇలా వివిధ లక్ష్యాలతో ఇప్పటికే ఎన్నో రకాల పాలసీలను అందుబాటులోకి తీసుకువచ్చింది.


 ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ తమ పాలసీదారులకు అందరికీ ఒక శుభవార్త అందించింది. చాలామంది ఎల్ఐసి పాలసీ తీసుకున్నప్పటికీ ఆ తర్వాత కొన్ని కొన్ని సమయాల్లో ఆర్థిక ఇబ్బందుల కారణంగా పాలసీ డబ్బులు కట్టకుండా ఉంటారు.ఇక ఆ తర్వాత పాలసీ లాప్స్ అవుతూ ఉంటుంది. దీంతో ఇక మళ్ళీ ఇక ఆ పాలసీ కట్టుకునే అవకాశం ఉంటే బాగుండు అని భావిస్తూ ఉంటారు. ఇలాంటి ఒక అదిరిపోయే వెసులుబాటు అందుబాటులోకి తీసుకువచ్చింది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. సరైన సమయానికి పాలసీ చెల్లించకపోతే ల్యాప్స్ అవుతుంది. ఇలా జరిగినప్పుడు పాలసీ ప్రయోజనాలను పొందలేరు. ఇలా ఎవరైనా పాలసీ ప్రీమియం కట్టకుండా ల్యాప్స్ అయిన పాలసీలను మళ్లీ రీస్టార్ట్  చేసే అవకాశం కల్పించింది.



 పెండింగ్లో ఉన్న ప్రీమియం చెల్లింపు తో ఇక ఈ పునరుద్ధరించు ప్రక్రియ కొనసాగుతోంది. ఇక లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సంస్థ దీనికోసం పాలసీదారులకు రెండు నెలల గడువు ఇచ్చింది. ఆగస్టు 23వ తేదీ నుంచి ఈ ఫెసిలిటీ ప్రస్తుతం పాలసీదారులకు అందుబాటులోకి వచ్చింది. అక్టోబర్ 22 వరకు ఈ పాలసీ రెన్యువల్ స్పెషల్ క్యాంపెయిన్ నడుస్తుంది. దీంతో ఇన్ని రోజుల వరకు ఎల్ఐసి పాలసీ లాప్స్ అయింది అని ఆందోళన చెందిన వారు ఇప్పుడు పాలసీ పునరుద్ధరించే అవకాశం మీకు అందుబాటులో ఉంది. ఇక పాలసీలను పునరుద్ధరించుకోవాలు అనుకుంటే అటు కంపెనీ నుంచి ఆలస్య రుసుములో కూడా రాయితీ లభిస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: