ఈ ప్రాంతంలో పాక్ ప్రభావిత ఉగ్రవాదం ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ చొరబాట్లు ఇప్పటికి భారీగా జరిగి ఉండటం, వాళ్ళు ప్రాంతీయ యువతను వారివైపు మళ్ళించుకోవడం వలన వాళ్ళ సైన్యం కూడా బాగానే ఉండి ఉంటుంది. దీని వలన ఎవరు ప్రజలు, ఎవరు ఉగ్రవాది అనేది స్పష్టంగా కనిపెట్టడం కాస్త కష్టంగానే ఉంటుంది. దీనివలన అక్కడ ఇంకా శాంతి నెలకొనలేదని తెలుస్తుంది. అక్కడ ప్రాంత ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరిస్తే ఈ పని ఇంకా సులభం అవుతుంది. ఒకవేళ ఈ ప్రభుత్వం మారిపోతే అనే ఆలోచన అక్కడి వారు అలా సాయం చేయడానికి వెనుకాడటానికి కారణం కావచ్చు.
ఈ ప్రభుత్వం మారిపోతే అనంతరం వచ్చే వాళ్ళు ఏవిధంగా కాశ్మీర్ విషయాన్ని తీసుకుంటారో తెలియదు. ఈ నేపథ్యంలో స్థానికుల సాయం కూడా అందడం కష్టం. దీనితో అక్కడ కేంద్రం బలగాలతోనే ఉగ్ర మూకలను అణిచేందుకు యత్నిస్తుంది. ఈ విధానం కంటే మెరుగైనది కూడా ప్రభుత్వం ఆలోచిస్తూనే ఉంటుంది. అయినా అప్పటిదాకా ఇక్కడ తుపాకులు పేలుతూనే ఉంటాయి. తాజాగా మరో ఉగ్రదాడిలో ముగ్గురు పౌరులు సహా పలువురు గాయపడ్డారు. వేర్వేరు చోట్ల ఈ దాడులు జరిగినట్టు అధికారులు తెలిపారు. అందులో ముగ్గురు పౌరులు, ఒక ఫార్మసీ యజమాని(మఖాన్ లాల్, పండిట్), ఒక వీధి వ్యాపారి ఉన్నట్టు తెలుస్తుంది.