సాధారణంగా మనిషి నేటి రోజుల్లో 60, 70 ఏళ్ల వరకు బతుకుతాడు అని అనుకునేవారు చాలామంది. కానీ కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత మాత్రం భవిష్యత్తు గురించి ఆశలు వదులుకున్నారు. ప్రాణం ఎప్పుడు పోతుందో కూడా కూడా తెలియని పరిస్థితుల్లో బ్రతికేస్తున్నారు. ఇప్పటికే కరోనా వైరస్ తో దేశంలోని అన్ని రాష్ట్రాలు అల్లాడి పోయాయి. ముఖ్యంగా కేరళ రాష్ట్రం అయితే మొదటి దశ కరోనా వైరస్ ను కంట్రోల్ చేసినట్లు కనిపించినప్పటికీ తర్వాత రెండవ దశలో మాత్రం వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగి పోవడంతో చివరికి విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి.


 దేశంలో వెలుగులోకి వచ్చిన ఎక్కువ కేసులు కేరళలోనే వెలుగులోకి రావడం గమనార్హం. ఈ క్రమంలోనే ప్రజలందరూ అప్రమత్తమై తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఇప్పుడు కేరళ ప్రజలందరికీ మరో ప్రాణాంతకమైన మహమ్మారి భయపెడుతుంది.. మనిషి ప్రాణాలు తీయడానికి ఏదో ఒక కొత్త వ్యాధి తెరమీదికి వస్తూనే ఉంది. ఇప్పుడు కేరళలో బర్డ్ ఫ్లూ కేసులు పెరిగిపోతుండడంతో అందరూ భయపడిపోతున్నారు. గత కొంత కాలం నుంచి వేల సంఖ్యలో కోళ్లు బాతులు వివిధ రకాల పక్షులు కూడా బర్డ్ ఫ్లూ వ్యాధి బారిన పడుతున్నాయి.



 దీంతో ఇక రాష్ట్ర ప్రజానీకం మొత్తం వణికి పోతూ ఉండగా అటు అధికారులు కూడా రంగంలోకి దిగి చర్యలు చేపట్టడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే అధికారులు బర్డ్ ఫ్లూ వ్యాపించకుండా ఏకంగా బలవంతంగా ప్రాణాలు తీస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల కొట్టాయం జిల్లాలో గత రెండు రోజుల్లో 16 వేల 976 బర్డ్ ఫ్లూ సోకిన బాతులను గుంత తవ్వి అందులో దహనం చేశారు అధికారులు. మరోవైపు వైరస్ ను నిర్వీర్యం చేసేందుకు ఫారాలలో రసాయనిక ప్రక్రియ కూడా చేపడుతూ  ఉండటం గమనార్హం. ఇలా బర్డ్ ఫ్లూ వ్యాపించకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: