![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_analysis/vasantha-krishna-prasad-devineni-uma-tdp-mailavaram-ycp7cbd3e16-7612-4743-8bf4-436c5a38da8a-415x250.jpg)
•జంపింగే వసంతకు కలిసి వస్తుందా.?
•మైలవరంలో టిడిపికి తిరుగులేదా.?
రాజకీయాలు:
వసంత వెంకట కృష్ణ ప్రసాద్ రాష్ట్రంలోని కృష్ణాజిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామంలో జన్మించాడు. కృష్ణ ప్రసాద్ తండ్రి పేరు నాగేశ్వరరావు, తల్లి పేరు హైమావతి. అలాంటి వసంత కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1999లో నందిగామ అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడారు. ఆ తర్వాత మరోసారి 2004లో పోటీ చేసి మరోసారి అపజయం చవిచూశారు. ఆయన ఓడిపోయినా కానీ మంచి లీడర్ గా గుర్తింపు మాత్రం పొందారు. 2005లో జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ కేడీసీసీ చైర్మన్, జాతీయస్థాయిలో ఆప్కాబ్ వైస్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు.
బలబలాలు:
మైలవరం నియోజకవర్గంలో గత కొన్ని సంవత్సరాల నుంచి ఉమామహేశ్వరరావు, వసంత కృష్ణ ప్రసాద్ లు రాజకీయ ప్రత్యర్థులు. వీరిద్దరు ఎదురుపడితే తప్పనిసరిగా గొడవ జరిగేది. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గు మనే అంత వైరం ఉండేది. ఇదే తరుణంలో వసంత కృష్ణ ప్రసాద్ టిడిపిలోకి రావడం సీటు దక్కించుకోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి వైసీపీ క్యాడర్ అంతా ఒక్కసారి ఆశ్చర్యపోయింది. అంతేకాకుండా వసంతకు తోడుగా దేవినేని ఉమా కూడా ఆయనతో చేతులు కలపడంతో అక్కడ టిడిపి బలంగా తయారైంది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో టిడిపి మొట్టమొదట గెలుచుకునే సీటు ఇదేనని విజయం ఖరారు అయినట్లే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.