ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికలు సైతం చాలా రసవత్తంగా మారుతున్నాయి. ముఖ్యంగా కీలక నేతలు కూడా ఈసారి గెలవాలని పట్టుదలతో ముందుకు వెళుతున్నారు.. గత కొన్నేళ్ల నుంచి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించినప్పటికీ ఓడిపోతూనే ఉన్నారు.. దీంతో ఎన్నోసార్లు దారుణమైన ట్రోలింగ్ కూడా గురైన సందర్భాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్.. ఈసారి పిఠాపురం నియోజవర్గం నుంచి జనసేన పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు.. కూటమిలో భాగంగా అటు టిడిపి, జనసేన, బిజెపి పార్టీలు మూకుమ్మడిగా ఒక్కటే వైసీపీ పార్టీని ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నారు.


పిఠాపురంలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ గెలుపు కోసం చాలామంది సెలబ్రిటీలు కమెడియన్స్ మెగా కుటుంబ సభ్యులు కూడా ప్రచారం చేస్తున్నారు.. అయితే ఒక్క పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఇంతమంది ప్రచారం చేస్తూ ఉండడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా అక్కడ వైసిపి నేత వంగా గీత పోటీలో ఉండడం చేత చాలా టఫ్ గా మారుతోంది. ఇప్పటికీ ఎంతోమంది నిర్మాతలు కూడా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఇప్పుడు తాజాగా హీరో న్యాచురల్ స్టార్ నాని కూడా తన మద్దతును ట్విట్టర్ రూపంలో తెలియజేశారు..


నాని ఇలా తెలియజేస్తూ ప్రజాసేవ కోసం రాజకీయాలలోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ ఈసారి ఎన్నికలలో గెలవాలని కోరుకుంటున్నానని పిఠాపురం అసెంబ్లీ పోరులో తలబడుతున్న జనసేన కి ఆల్ ది బెస్ట్ అంటూ కూడా వెల్లడించారు.. కేవలం సినీ కుటుంబంలో ఒకడిగా తన మద్దతు ఇదేనంటూ వివరించారు.. అలాగే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను కూడా నిలబెట్టుకోవాలని సూచించారు న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం అందుకు సంబంధించి ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.. అలాగే సినీ ఇండస్ట్రీ మద్దతు కూడా పవన్ కళ్యాణ్ కు ఉంటుందంటూ నాని ఆశాభావాన్ని తెలియజేస్తున్నారు.. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలోని రాజకీయం మాత్రం ఇప్పటికీ హార్ట్ టాపిక్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: