
విజయ్ సొంతంగా ఒక పార్టీని స్థాపించి 2026 లో తమిళనాడు ఎన్నికలలో పోటీ చేయబోతున్నట్లు తెలియజేశారు. ఈ ఎన్నికల కోసం సిద్ధమవుతూ ఉన్నారు విజయ్ అతని ఇమేజ్ ని సైతం దెబ్బతీసే విధంగా అపహేళన చేస్తూ ప్రతిపక్షాలు ఇప్పటినుంచే పలు రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. తాజాగా విజయ్ పైన తమిళనాడు మంత్రి పన్నీరు సెల్వన్ చాలా ఘాటుగానే వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒక సభలో మంత్రి మాట్లాడుతూ.. విజయ పార్టీ TVK అంటే ఏంటో చెప్పాలి అంటూ ఆయన అభిమానులను ప్రశ్నించడం జరిగింది.
దీనికి వెంటనే త్రిష, విజయ్ ,కీర్తి సురేష్ అనే సమాధానం ఇచ్చారు అంటూ తెలియజేశారు. ఈ కామెంట్లు ప్రస్తుతం తమిళనాడు చర్చనీయాంశంగా మారుతున్నాయి అసలు విజయ్ పార్టీకి త్రిష, కీర్తి సురేష్ కి సంబంధం ఏమిటి? అంటూ ప్రశ్నించడం జరుగుతోంది విజయ ఫ్యాన్స్. అయితే గతంలో విజయ్ ,త్రిష ,కీర్తి సురేష్ లకు ఎఫైర్ ఉందని అందుకే మంత్రి ఇలా విజయని కూడా ఎద్దేవ చేసినట్లుగా చేశారనే విధంగా మాట్లాడుకుంటున్నారు. ఈ విషయం తమిళనాడులో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. అయితే ఈ విషయాలకు హీరో విజయ్ కూడా గట్టి కౌంటర్ ఇవ్వబోతున్నట్లు తమిళ రాజకీయాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి