
జ్యోతి మల్హోత్రా సైనిక లేదా రక్షణ కార్యకలాపాలకు సంబంధించిన అన్ని విషయాలను కూడా వారితో షేర్ చేసుకుందని ప్రస్తుతం ఏ దశలో ఉందనేది చెప్పలేము కానీ పాకిస్తాన్ నిగా వర్గాలతో ఈమె నేరుగా సంప్రదింపులు జరిపిందని తెలుపుతున్నారు. ఈమెను వారు ఒక అస్త్రంగా చేసుకున్నారని ఖచ్చితంగా చెప్పగలము అంటూ అధికారులు తెలుపుతున్నారు. జ్యోతి మరి కొంతమంది యూట్యూబర్స్ తో చాలా సన్నిహితంగా ఉన్నట్లు తెలియజేశారు. వీరు కూడా పి.ఐ.ఓ లతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారని తెలియజేశారు.
ఇలా చేయడం కూడా ఒక రకమైన యుద్ధమేనని ఇన్ఫ్లుయర్స్ ను ఉపయోగించుకుంటూ వారికి సంబంధించిన విషయాలను రాబట్టుకోవడమే పాకిస్తాన్ చేస్తున్న పని అంటూ అధికారులు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా జ్యోతి పాకిస్తాన్ లో ఎన్నోసార్లు పర్యటించిందని ఒకసారి చైనాకు కూడా వెళ్లినట్లు అధికారులు పోలీస్ విచారణలో తెలియజేశారు. ఇటీవలే బహిష్కరణకు గురైన ఫాక్ అధికారితో కూడా ఈమె టచ్ లో ఉందని , అక్కడి నుంచి ఆర్థిక లావాదేవీలు ప్రయాణ వివరాలను కూడా విశ్లేషిస్తున్నామని ఈ విశ్లేషణ.. జ్యోతి ప్రయాణం ఎక్కడి వరకు వెళ్లిందని విషయంపై ఆరా తీస్తున్నామని.. ఆమె ల్యాప్టాప్ తో సహా ఎలక్ట్రిక్ పరికరాలు అన్నిటి పైన ఫోరెన్సిక్ నిపుణులు విశ్లేషిస్తున్నారని తెలుపుతున్నారు. పూర్తి సమాచారం అప్పుడు బయటపడుతుందని తెలుపుతున్నారు అధికారులు.