గుజరాత్ అహ్మదాబాద్ లోని  ఎయిర్ పోర్ట్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి సుమారు 300 మంది ప్రయాణికులతో  గురువారం లండన్ బయలుదేరిన ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన కొన్ని నిమిషాలకే కుప్పకూలిపోయింది. ఫ్లైట్ నెంబర్ ఏఐ171 విమానం సుమారు 300 మంది ప్రయాణికులతో గురువారం మధ్యాహ్నం లండన్ వెళ్లడానికి అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అయింది .

ఎప్పటిలాగే విమానం టేక్ ఆఫ్ అయ్యే ముందు అన్ని టెక్నికల్ ఇష్యూస్ చెక్ చేసుకున్నాకే రన్వే నుంచి టెకాఫ్  అయింది ఏఐ 171 విమానం.  అయితే రన్వే  నుంచి టెక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే విమానం ప్రమాదానికి గురైంది . మేఘాని నగర్ గోడసర్ క్యాంప్ ప్రాంతాలయంలో విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో భారీ ఎత్తున పేలుడు శబ్దం అలాగే దట్టమైన పొగ అల్లుకునేసింది. ఈ పొగ అన్ని వైపులకు వ్యాపించేసింది . సుమారు విమానం 825 అడుగుల ఎత్తులో ఉండగా సాంకేతిక లోపం కారణంగానే విమాన, కింద పడిపోయినట్లు  జాతీయ మీడియా చెప్తుంది.
 
టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాలకే ఫ్లైట్ కొంచెం కొంచెంగా గా కిందకి వాళిపోతూ సరిగ్గా  1:30 సమయంలో పూర్తిగా దిగిపోయి చెట్టును ఢీకొనేసింది అని ఆ కారణంగానే  ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.  ప్రమాదానికి గురైన విమానం వైట్ బాడీ బోరింగ్ 787 డ్రీమ్ లైనర్ . అంతేకాదు ఈ విమానంలో సుమారు 300 మంది ప్రయాణించవచ్చు . అంతేకాదు సుదూర ప్రయాణం కావడంతో విమానంలో ఇంధనం కూడా భారీగా ఉండడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగిపోయింది అంటున్నారు అధికారులు .

విమానం కూలిపోయింది అనే విషయం తెలియగానే ఫైర్ ఇంజన్లు ఆ ప్రాంతానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు . ఈ ఫ్లైట్లో గుజరాత్ మాజీ సీఎం విజయ రూపాని  కూడా ఉన్నారు . అంతేకాదు ప్రమాద విషయం తెలుసుకోగానే కేంద్ర పౌర విమానాయాల శాఖ మంత్రి కే రామ్మోహన్ ఘటన స్థలానికి బయలుదేరారు . అంతేకాదు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో ఫోన్లో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నారు . ఎప్పటికప్పుడు అక్కడ పరిస్థితి మొత్తం తనకు తెలియజేయాలి అని ఆర్డర్ వేశారు .

అంతేకాదు ఈ ప్రమాదం పై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ స్పందించింది . విమానానికి కెప్టెన్లుగా ఉన్న సుమిత్ సబర్వాల్ అలాగే ఫస్ట్ ఆఫీసర్ గా క్లైవ్ కుందల్  వ్యవహరించినట్లు తెలిపారు.  సుమిత్ కి ఎల్ టి సి గా 8200 గంటలు అలాగే కోపైలెట్  1100 గంటల అభుభవం ఉన్నట్లు కూడా వెల్లడించింది . ఈ విమానం రన్వే 23 నుంచి గాల్లోకి ఎగిరినట్లు కూడా తెలిపింది . కొద్దిసేపటికి ఎయిర్ క్రాఫ్ట్ నుంచి ఏటీసీకి అత్యవసర కాల్ వచ్చిందని కూడా వెల్లడించింది . పరిస్థితి క్లియర్ చేసే లోపే విమానం కుప్ప కోల్పోయినట్లు పేర్కొంది . మరోవైపు ఎయిర్ ఇండియా కూడా ఎక్స్ వేదికగా ప్రమాదాన్ని అఫీషియల్ గా దృవీకరించింది.






 





మరింత సమాచారం తెలుసుకోండి: