ఆంధ్ర నేతలు ముఖ్యమంత్రులు అయ్యి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారనే వాదన వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు దాటినా రెండు రాష్ట్రాల మధ్య పలు సమస్యలు మాత్రం అలాగే కొనసాగుతున్నాయి. ప్రధానంగా నీటి పంపకాలకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య సమస్యలు తలెత్తుతున్నాయి.

నేతలు తమ మాటలతో  ప్రజల్ని మోసం చేస్తూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. నేతలు చెప్పే మాటలకు  చేసే పనులకు పొంతన ఉండటం లేదు.  నాయకుల దొంగ మాటలు పార్టీకి తీవ్రస్థాయిలో నష్టం చేస్తున్నాయి.  ప్రస్తుతం తెలంగాణాలో  తెలంగాణ నేతలే పాలకులుగా ఉన్నా నేతలపై వ్యతిరేకత మాత్రం కొనసాగుతోంది.  అప్పుడు రాజకీయాల్లో ఉన్న నేతలే  ఇప్పటికీ రాజకీయాల్లో కొనసాగుతుండటం గమనార్హం.

ప్రస్తుతం బనకచర్ల ప్రాజెక్ట్ ను తెరపైకి  తీసుకురావడం కూడా ఆంధ్ర  తెలంగాణ  నేతల గేమ్  ప్లాన్ అని  సోషల్ మీడియా వేదికగా  కామెంట్లు  వ్యక్తమవుతున్నాయి.  ప్రజలను నేతలు ఎమోషనల్ గా మోసం చేస్తున్నారని  అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి  కొత్త ప్రాజెక్ట్ లను  తెరపైకి తెస్తున్నారు.  మొదలుపెట్టిన ప్రాజెక్ట్ లకు  దిక్కు లేదని  కామెంట్లు వినిపిస్తున్నాయి.

బనకచర్ల ప్రాజెక్ట్  ను తెరపైకి తీసుకురావడం వల్ల ప్రజలకు ప్రస్తుతం ఒరిగేది  లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.  ఈ ప్రాజెక్ట్  చేపడితే  తెలంగాణకు 200 టీఎంసీల  జలాలివ్వాలని  విశ్రాంత ఇంజనీర్ల  సంఘం రెండు ప్రతిపాదనలు  పంపింది.   ఇంకా మొదలు కానీ ప్రాజెక్ట్ కు  రాద్ధాంతం ఎందుకని అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.  బనకచర్ల ప్రాజెక్ట్ వివాదానికి సంబంధించి రాబోయే రోజుల్లో  ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాల్సి ఉంది.



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: