
ఈ సంఘటన తర్వాత పైలట్లు మేడే కాల్ జారీ చేశారని, అయితే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్పందించినప్పటికీ విమానం నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదని ఏఏఐబీ తెలిపింది. కొద్ది క్షణాల్లోనే విమానం కుప్పకూలినట్లు నివేదిక వివరించింది. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను పరిశీలించినట్లు ఏఏఐబీ స్పష్టం చేసింది. ప్రమాద కారణాలను గుర్తించేందుకు ఈ ఆధారాలు కీలకంగా ఉపయోగపడతాయని తెలిపింది.విమానానికి సంబంధించిన రెండు ఇంజిన్లను వెలికితీసినట్లు ఏఏఐబీ పేర్కొంది. తదుపరి పరీక్షల కోసం కాంపోనెంట్స్ను గుర్తించి, ఇంజిన్లను భద్రపరిచినట్లు వెల్లడించింది. ప్రమాదానికి ముందు విమానంలో ఇంధనం, బరువు పరిమితుల్లోనే ఉన్నాయని, ఎలాంటి ప్రమాదకర వస్తువులు లేనట్లు నివేదిక స్పష్టం చేసింది.
ఈ సమాచారం ప్రమాద కారణాలను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుందని అధికారులు భావిస్తున్నారు.ఈ నివేదిక ఆధారంగా, విమాన ప్రమాదానికి ఇంధన కంట్రోలర్ స్విచ్ల వైఫల్యం ఒక కీలక కారణంగా కనిపిస్తోంది. ఏఏఐబీ ఈ దిశగా మరింత లోతైన విచారణ జరుపుతోంది. ఈ ఘటన దేశంలో గగనతల విమాన రంగంలో భద్రతా చర్యలపై కొత్త చర్చకు దారితీసింది. తదుపరి నివేదికలు మరింత స్పష్టతను తీసుకొచ్చే అవకాశం ఉంది.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు