యంగ్ హీరో తేజ సజ్జా ప్రస్తుతం వరుసగా విభిన్నమైన చిత్రాలతోనే కాకుండా సరికొత్త కథయంశాలతో దూసుకుపోతున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వచ్చిన హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో మార్కెట్ సంపాదించుకున్నారు తేజ సజ్జా. ప్రస్తుతం డైరెక్టర్ కార్తీ ఘట్టమనేని డైరెక్షన్లో మిరాయ్ చిత్రంలో నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే రిలీజ్ చేయబోతున్నారు. బాలీవుడ్ లో బడా బ్యానర్ గా పేరు పొందిన ధర్మ ప్రొడక్షన్ వారు రిలీజ్ చేయబోతున్నారు.



తేజ సజ్జా బర్త్డే కానుకగా తన తదుపరి చిత్రాలను కూడా ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం మిరాయ్  సినిమా తెరకెక్కిస్తున్న పీపుల్ మీడియా మరో సినిమాని తేజ సజ్జా తో చేయబోతున్నట్లు ప్రకటించారు. రాయలసీమ  వరల్డ్ అంటూ ప్రకటించిన మేకర్స్ అయితే ఈ చిత్రానికి డైరెక్టర్ ఎవరు ? అసలు ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటి అనే విషయం మాత్రం చెప్పలేదు. వినిపిస్తున్న సమాచారం ప్రకారం పీపుల్ మీడియా చేస్తున్న ఈ సినిమా జాంబిరెడ్డి సినిమాకి సీక్వెల్ అన్నట్లుగా వినిపిస్తున్నాయి.


ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో 2021 లో ఈ సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. అప్పటినుంచి ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబినేషన్లో వస్తున్న సినిమాలు సూపర్ హిట్టుగా నిలిచాయి. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గానే జాంబి రెడ్డి-2 తీసుకురాబోతున్నట్లు వినిపిస్తున్నాయి. ఈ సీక్వెల్స్ ని కూడా భారీ బడ్జెట్లోనే తెరకెక్కించేలా ప్లాన్ చేస్తోంది. ఈ చిత్రానికి కూడా ప్రశాంత్ వర్మ కథ అందిస్తున్నారని ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించేలా ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి జాంబిరెడ్డి సినిమాని మించి ఈసారి ఈ చిత్రం ఉండేలా చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.  మరి ఈ చిత్రం జాంబిరెడ్డి 2 నో కాదో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: