ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఏపీకి రాజధాని ఏది అనే చర్చ పాలిటిక్స్ చుట్టూ తిరుగుతోంది. సుమారుగా తొమ్మిదేళ్లుగా రాజధాని అభివృద్ధి జరగలేదు.2014 లో టిడిపి అధికారంలో ఉన్నప్పుడు ఏపీకి రాజధాని అమరావతి అంటూ అభివృద్ధి చేస్తూ అడుగులు వేసింది. 2019 వైసిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానులు అంటూ తెరపైకి తీసుకువచ్చింది. 2024 ఎన్నికలలో వైసిపి పార్టీ వీటిని వ్యూహంగా ఉపయోగించి ఓట్లు అడగగా ప్రజలు తిరస్కరించారు. అమరావతికే ఓటు వేశారు. దీంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమరావతిని మరింత అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు చేస్తూ కేంద్రం నుంచి నిధులను తీసుకొని రాజధాని పనులు పరుగులు పెట్టేలా చేస్తున్నారు.


2024 గోర ఓటమి తర్వాత వైసీపీ పార్టీ ఇప్పుడు అమరావతి విషయంపై స్టాండ్ మార్చినట్టుగా కనిపిస్తోంది. మూడు రాజధానులు ప్రజల నుంచి వ్యతిరేకం రావడంతో ఇప్పుడు ఆలోచన లేదని.. ఒకవేళ వైసీపీ పార్టీ తిరిగి మళ్లీ అధికారంలోకి వస్తే అమరావతి నుంచి జగన్ పరిపాలన కొనసాగిస్తారు అంటూ ఇటీవలే సజ్జల రామకృష్ణారెడ్డి కూడా తెలియజేశారు. అంతేకాకుండా ప్రభుత్వం పై భారం తగ్గిస్తూ గుంటూరు, విజయవాడ మధ్య ఒక మహానగ నిర్మాణానికి కూడా తాము కృషి చేస్తామంటూ తెలిపారు. లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి అమరావతి కట్టడాన్ని తాము వ్యతిరేకించామని తెలిపారు. ఆ మధ్య జగన్ కూడా మీడియాతో మాట్లాడుతూ అమరావతి రాజధాని ఖర్చు ఎక్కువ అవుతుందంటూ విమర్శించారు. అంతేకాకుండా విజయవాడ, గుంటూరును జంట నగరాలుగా చేయవచ్చని తెలిపారు. దీన్ని బట్టి చూస్తూ ఉంటే రాజధాని విషయంపై అమరావతి వైపే మెగ్గుచూపునట్లుగా కనిపిస్తోంది వైసిపి.

 

వైసిపి అనుకూల మీడియాలో కూడా రాజధాని అమరావతి పైన చంద్రబాబు తీరు ఇలా ఉందంటూ ..53,748 ఎకరాలలో ప్రపంచంలోనే అత్యంత రాజధానిని నిర్మిస్తామంటూ ఎన్నో ఏళ్లుగా ప్రగల్బాలు పలుకుతున్నారు.1.09 లక్షల కోట్లతోనే 2018లో పూర్తి చేస్తానంటూ నీతి అయోగ్ ద్వారా వెల్లడించారు. 5,428  ఖర్చు చేసి మరి  ఇటీవలే 56,000 కోట్ల విలువైన పనులను కాంట్రాక్టర్లకు అప్పగించారు. మొదటి విడత పనులు 2036 నాటికి పూర్తి అవుతాయని..అప్పటికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చవుతుందని.. అలాగే అంతర్జాతీయ విమానాశ్రయం అంటూ 44, ఎకరాలను సమీకరించారు..రాజధాని పనులకి అంచనా రూ .1.5 లక్షల కోట్లు అవుతుందని  విశ్లేషకులు అంచనా వేస్తున్నారు .. రాజధాని లోని సదుపాయాలు ,అభివృద్ధి పనులకు మరో 1.5 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని ఈ లెక్కన అమరావతి రాజధాని పూర్తి అయ్యేసరికి రూ .3 లక్షల కోట్లు అవుతుందని.. వడ్డీతో కలిపిరూ .5.5 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని.అదే గుంటూరు, విజయవాడ మధ్య రాజధాని అయి ఉంటే కేవలం 5లేదా 6వేల కోట్లతోనే అయిపోయేది. మూడేళ్లలో పూర్తయ్యేదని.. కేవలం ముడుపుల కోసం అప్పట్లో కాజేసిన భూముల ధరలు పెంచుకునేందుకే రాష్ట్ర ప్రజల పైన పెనుబారం మోపుతున్నారు చంద్రబాబు అంటూ విశ్లేషకులు చెబుతున్నారని రాసుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: