ప్రస్తుతం పార్టీ పరంగా తుఫాను బాధిత గ్రామాలలో పర్యటించాలని అనుకున్నారు. జగన్ కూడా ఓకే చెప్పారు. పార్టీ తరఫున సాయం చేయాలని అనుకున్నారు. ఇంతలోనే జగన్ మనసు మార్చుకుని .. మీరు చూసుకోండి అని బెంగళూరు ఫ్లైట్ ఎక్కేశారు. సీఎం చంద్రబాబు లండన్ టూర్ కి వెళుతున్న నేపథ్యంలో ఇప్పుడు మనం ఇక్కడ పోరాటం చేసి ఉపయోగం ఉండదని జగన్ కొందరు కీలక నేతలకు చెప్పి బెంగళూరు వెళ్లిపోయారని అంటున్నారు.
జిల్లా స్థాయి నాయకులు ఎంపిక పార్టీ పరంగా చర్చించాల్సిన అంశాలను కూడా జగన్ పక్కన పెట్టేసారని తెలుస్తోంది. తాడేపల్లి కార్యాలయంలో అన్ని వ్యవహరించే కీలక నేతలు కూడా పర్యటనలకు వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా జగన్ అనుసరిస్తున్న విధానాల కారణంగా పార్టీపై గట్టి ఎఫెక్ట్ పడుతుందని.. వైసీపీలోనే అంతర్గతంగా చర్చ జరుగుతుంది. జగన్ ఇలాంటి టైం లో రాష్ట్రంలో ఉండి ప్రజల తరఫున పోరాటం చేయాల్సింది పోయి.. బెంగళూరు వెళ్ళిపోతే ఇక పార్టీని ఎవరు పట్టించుకుంటారు ? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి