సీఎం చంద్రబాబు ఉండవల్లి నివాసంలో ఉండడంతో అక్కడ చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ కూడా కలిసి శ్రీచరణీని అభినందించారు. ఉమెన్ వరల్డ్ కప్ గెలవడం ద్వారా భారతదేశ మహిళల సత్తా కూడా చాటి చూపించారని మహిళా క్రీడాకారులకు మీరు ఆదర్శంగా నిలవాలంటు సలహా ఇచ్చారు సీఎం చంద్రబాబు. చదువుకొనే బాలికలు సైతం వీరిని స్ఫూర్తిగా తీసుకొని పైకి ఎదగాలని తెలియజేశారు. అంతేకాకుండా ఇలాంటి ప్రతిభను కనబరిచిన వారందరికీ కూడా అన్ని విధాలుగా ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుందంటూ తెలియజేశారు.
అలాగే మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా ఉన్నారు. తొలిసారి వన్డే ప్రపంచ కప్ కైవసం చేసుకున్న భారత మహిళా జట్టులో శ్రీ చరణీ కీలకమైన పాత్ర పోషించింది. ఈ విషయాన్ని గుర్తించిన ఏపీ ప్రభుత్వం శ్రీ చరణీకి ప్రభుత్వ ఉద్యోగంతో(గ్రూప్ - 1)పాటుగా కడపలో ఇంటి స్థలం ఏపీ సర్కార్ గిఫ్ట్ కింద అందజేశారు. అలాగే ఏపీ ప్రభుత్వం నుంచి రూ. 2.5 కోట్ల రూపాయలు నగదు కూడా అందజేసినట్లు ప్రకటించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి