అయితే… జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితాలతో ఈ క్రెడిబిలిటీకి పెద్ద పరీక్ష వచ్చింది. కేకే సర్వే ఈ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ విజయం ఖాయం అని ధీమాగా చెప్పింది. ప్రీ పోల్స్ మరియు ఎగ్జిట్ పోల్స్ రెండింటిలోనూ బీఆర్ఎస్కు భారీ ఆధిక్యం చూపించింది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీఆర్ఎస్కు 49 % ఓట్లు, కాంగ్రెస్కు 41 %, బీజేపీకి 8% ఓట్లు వస్తాయని అంచనా వేసింది. అంతేగాక బీఆర్ఎస్ పాలనపై ప్రజలలో మంచి నమ్మకం ఉందని గట్టిగా విశ్లేషించింది. ప్రీ పోల్స్కి వస్తే బీఆర్ఎస్కు ఏకంగా 55.2% ఓటు షేర్, కాంగ్రెస్కు 37.8%, బీజేపీకి 7% అని ప్రకటించటం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. కానీ వాస్తవ ఫలితాలు పూర్తిగా రివర్స్ అయ్యాయి. బీఆర్ఎస్ భారీ తేడాతో ఓడిపోయింది. కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. దీంతో కేకే సర్వే అంచనాలు పూర్తిగా తప్పు అయ్యాయని విమర్శలు వెల్లువెత్తాయి.
ఇక ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే ప్రీ పోల్స్ రిలీజ్ చేయడం వల్ల కేకే సర్వే ఎన్నికల నియమాలను ఉల్లంఘించిందని కాంగ్రెస్కు చెందిన అద్దంకి దయాకర్, బలమూరి వెంకట్ ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు కూడా చేశారు. ఇది సర్వేపై మరింత ప్రతికూల ప్రభావం చూపించింది. గతంలో హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కేకే సర్వే బీజేపీ ఓడిపోతుందని చెప్పి రివర్స్ అయ్యింది. కానీ అక్కడ బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చింది. ఈ రెండు వరుస తప్పిదాల వల్ల కేకే సర్వే క్రెడిబిలిటీపై ఇప్పుడు ప్రశ్నార్థకాలు తలెత్తుతున్నాయి. 2019, 2024లో దూకుడు చూపించిన ఈ సంస్థ ఇప్పుడు పలు సందర్భాల్లో గ్రౌండ్ రియాల్టీ పట్టుకోవడంలో విఫల మవుతూ ఉండడం వారి విశ్వసనీయతను ప్రశ్నిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి