ఢిల్లీ నోయిడా ప్రాంతాలతో పాటు గ్వాలియర్ విశాఖపట్నం వంటి నగరాల్లో ఈగల్ బృందం ఏకకాలంలో దాడులు నిర్వహించింది. నిందితుల వద్ద నుంచి భారీ మోతాదులో డ్రగ్స్ భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ ఢిల్లీ మధ్య డ్రగ్ సరఫరా లింకులను గుర్తించిన ఈగల్ బృందం గత కొన్ని నెలలుగా ప్రత్యేక నిఘా ఉంచింది. ఈ నిఘా ఫలితంగానే ఈ భారీ విజయం సాధ్యమైందని అధికారులు తెలిపారు.అక్రమంగా దేశంలో ఉంటూ డ్రగ్ రవాణా నెట్వర్క్లు నడిపిస్తున్న విదేశీ పౌరులపై తెలంగాణ పోలీసులు గతంలోనూ కొన్ని సార్లు దాడులు చేశారు.
ఈసారి మాత్రం దేశవ్యాప్త స్థాయిలో జరిపిన ఆపరేషన్ దిగ్భ్రాంతికరంగా మారింది. నైజీరియా మాఫియా గ్యాంగ్లు హైదరాబాద్ను కేంద్రంగా చేసుకుని దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న విషయం ఈ దాడుల్లో బయటపడింది.ఈ విజయవంతమైన ఆపరేషన్తో తెలంగాణ ఈగల్ బృందం మరోసారి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. డ్రగ్స్ మాఫియాను అరికట్టడంలో ఈగల్ టీమ్ చూపిన చైతన్యం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని పోలీసు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ ఘటన తర్వాత దేశంలోని డ్రగ్ నెట్వర్క్లపై మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి