సాధారణంగా యువతి యువకులు ఇద్దరు కూడా కోటి ఆశలతో దాంపత్య బంధంలోకి అడుగుపెడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే పెళ్లి అనేది ఇలా నూతన వధూవరులకు ఎంత ప్రత్యేకమైనదో ఇక పెళ్లి తర్వాత హనీమూన్ అనేది కూడా అంతే ప్రత్యేకమైనది. ఇక ఒకప్పుడైతే కేవలం సంపన్నులు మాత్రమే ఇలా పెళ్లి తర్వాత హనీమూన్ ప్లాన్ చేసుకొని వెళ్లేవారు. కానీ ఇటీవల కాలంలో సామాన్యులు సైతం తమ కొత్త బంధాన్ని మరింత ప్రత్యేకంగా మార్చుకునేందుకు హనీమూన్ ప్లాన్ చేసుకుంటున్నారు అని చెప్పాలి. సాధారణంగా హనీమూన్ కు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న అందమైన ప్రదేశాలను వీక్షించడమే కాదు అటు భార్యాభర్తలు ఇద్దరు కూడా శారీరకంగా మానసికంగా సంతోషాన్ని అనుభవించడం చేస్తుంటారు.



 ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరు కూడా పెళ్లి చేసుకుని అందరిలాగానే హనీమూన్ వెళ్లారు. కానీ హనీమూన్ కి వెళ్ళిన తర్వాత భర్త చేసిన పని తెలిసి ఆ యువతీ షాక్ అయింది.. భార్యతో సంతోషంగా గడపాల్సింది పోయి అతను ఏకంగా భార్య ప్రైవేట్ ఫోటోలను తీసి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. దీనికంతటికి కారణం అత్తింటి వారు పూర్తిస్థాయి కట్నం ఇవ్వకపోవడమే. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. పిలిభిత్ జిల్లాలో యువకుడికి మ్యారేజ్ జరిగి మూడు నెలలు అయినా కూడా భార్యకు దూరంగానే ఉంటున్నాడు. ఏమైనా చికిత్స తీసుకోమని అల్లుడికి అత్త సూచించింది.



 అయితే 10 లక్షల రూపాయలు ఇస్తే మీ కూతురుతో కలిసి హనీమూన్ కు వెళ్తాను అంటూ చెప్పాడు అల్లుడు. దీంతో అత్త చేసేదేమీ లేక ఐదు లక్షల రూపాయలు ఇచ్చింది. అయితే అత్త ఇచ్చిన 5 లక్షలతో హనీమూన్ కు బయలుదేరిన అల్లుడు.. అక్కడకి వెళ్ళాక మాత్రం భార్యకి ఊహించని షాక్ ఇచ్చాడు. భార్య ప్రైవేట్ ఫోటోలు తీసి మరో ఐదు లక్షలు తీసుకు వస్తేనే హనీమూన్ జరుగుతుందని.. లేకపోతే ఇక మీ కూతురు ఫోటోలు ఇంటర్నెట్ లో పెడితే రచ్చ రచ్చ చేస్తాను అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ఒక్కసారిగా ఆందోళనకు గురైన సదర్ యువతి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: