ఏ వ్రతమైనా సరే ముందుగా నిత్య పూజను చేసిన తర్వాతే వ్రతమును చేయాలి. వ్రతం కోసం పసుపు గోధుమతో చేసినటువంటి అమ్మవారిని పసుపు , కుంకుమలతో అలంకరించిన పీటపై ప్రతిష్టించాలి. అదే విధంగా పసుపుతో చేసిన గణపతిని కూడా తమలపాకుపై ఉంచాలి. అమ్మవారికి నైవేద్యంగా... తర్వాత దానికి కావలసిన పదార్థాలను కూడా సిద్ధంగా ఉంచుకుని షోడశోపచార పద్ధతిలో పూజ చేయాలి. ఈ పదార్థాలు పానకం వడపప్పు చలివిడి ఐదు రకాల పండ్లు మరియు కొబ్బరికాయ వీలైతే పాలు బెల్లం పరమాన్నం కూడా నైవేద్యంగా ప్రసాదించవచ్చు. ఈ పూజ అంతా పూర్తి చేసిన తర్వాత అంతవరకు అష్టోత్తర నామాలు సహస్ర నామాలు పారాయణ చేయాలి. గౌరీ వ్రత కథను చెప్పుకోవాలి.
మంగళగౌరీ వ్రతం చేసే రోజు స్త్రీలు పూర్తి రోజు ఉపవాసం ఉంటే మంచిది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి