టోక్యో ఒలంపిక్స్.. నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మెగా క్రీడల్లో సత్తా చాటడానికి ప్రతి ఒక్క క్రీడాకారుడు కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక టోక్యో ఒలంపిక్స్ లో పతకం సాధించడమే లక్ష్యంగా ఎంతగానో శ్రమిస్తూ ఉంటారు.  టోక్యో ఒలంపిక్స్ లో తమ ప్రతిభను చాటి పతకాన్ని సాధించి ఏకంగా తమకూ గుర్తింపు తెచ్చుకోవడమే కాదు దేశ గౌరవాన్ని సైతం నిలబెట్టాలని అనుకుంటారు ప్రతి ఒక క్రీడాకారుడు.  అయితే టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొనడం అనేది అంత సులువైన పని కాదు.. అప్పటి వరకూ ఎన్నో టోర్నీలో సత్తా చాటి.. ఎంతో అనుభవం సాధించిన క్రీడాకారులు   మాత్రమే టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధిస్తూ ఉంటారు.



 ఇక అదేరీతిలో టోక్యో ఒలంపిక్స్ లో కూడా రాణిస్తూ పథకానికి చేరువగా దూసుకుపోతూ ఉంటారు.  కానీ ఇటీవల జరుగుతున్న టోక్యో ఒలంపిక్స్ లో మాత్రం ఎంతో మంది యువ ఆటగాళ్లు కూడా సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. అప్పటి వరకు ఎలాంటి అనుభవం లేకపోయినప్పటికీ.. అలవోకగా పథకానికి చేరువగా దూసుకుపోతున్నారు. మరికొంతమంది అథ్లెట్లు ఏకంగా బంగారు పతకాలను సైతం సాధించి తమ సత్తా చాటుతున్నారు. ఇక భారత్కు చెందిన ఎంతో మంది క్రీడాకారులు కూడా పతకం సాధించడమే లక్ష్యంగా అద్భుతంగా రాణిస్తున్నారు  అనే విషయం తెలిసిందే.



 అయితే విశ్వ క్రీడలు అయిన టోక్యో ఒలంపిక్స్ లో పోటీ పడుతున్నప్పటికీ కొంతమంది ఆటగాళ్ల పేర్లు మాత్రం దాదాపుగా చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి కోవలోకి వచ్చే వారిలో రీచ్ గేమ్ అయిన గోల్ఫ్ ఆడే ఆటగాల్లు కూడా కొంతమంది  అయితే ఇటీవలే రిచ్ గేమ్ గా పిలువబడే గోల్ఫ్ ఆట లో భారత్కు చెందిన అతిధి అశోక్ ఇటీవలే టోక్యో ఒలంపిక్స్ లో బరిలోకి దిగింది. అంతే కాకుండా ఇటీవలే అద్భుతంగా రాణించారు. ఇటీవలే జరిగిన పోటీలలో ఎంతో అనుభవం ఉన్న విదేశీయులకు సైతం పోటీ నిస్తూ టాప్ లో నిలిచింది అతిథి అశోక్. దీంతో ఇక ప్రస్తుతం రెండవ రౌండ్ కి క్వాలిఫై అయింది. ఇక అతిథి అశోక్ కుమార్ మరిన్ని రౌండ్లు గెలిచి పథకం గెలవాలి అని ప్రస్తుతం భారతీయులందరూ ఆకాంక్షిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: