నిన్న భారత్ పాకిస్తాన్ మధ్య హై వోల్టేజీ మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ ను ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా వీక్షించారు. అయితే ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్లో పాకిస్థాన్ జట్టు విజయం సాధించింది.  మొదట మ్యాచ్లో అందరికీ హాట్ ఫేవరేట్గా టీమిండియా జట్టు బరిలోకి దిగింది. టీమిండియా జట్టులో అందరూ ఆటగాళ్లు కూడా అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతూ ఉండడంతో ఇక టీమిండియాకు తిరుగులేదు అని అనుకున్నారు అందరు.  మరోసారి పాకిస్థాన్ జట్టుఫై టీమిండియా జట్టు అద్భుత విజయాన్ని సాధిస్తుంది అని భారీగానే అంచనాలు పెట్టుకున్నారు.


 కానీ టీమిండియా జట్టు అతికష్టం మీద 150 పరుగులు చేసింది. అయితే టీమిండియా ఇచ్చిన లక్ష్యాన్ని ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే పాకిస్థాన్ జట్టు చేధించింది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటి వరకు ఒక్క సారి కూడా టీమిండియాపై విజయాన్ని సాధించని పాకిస్తాన్ జట్టు.. ఇటీవలే టీమిండియాపై అద్భుత విజయాన్ని సాధించి..  సరికొత్త చరిత్రకు నాంది పలికింది అని చెప్పాలి. పాకిస్తాన్ భారత్ లాంటి హై వోల్టేజ్ మ్యాచ్లో కేవలం ఆటగాళ్లకు మాత్రమే కాదు అంపైర్  పై కూడా తీవ్రస్థాయిలో ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే ఏ చిన్న పొరపాటు జరిగినా మ్యాచ్ స్వరూపమే మారిపోతుంది.



 ఈ క్రమంలోనే అటు నిన్నటి మ్యాచ్ లో అంపైర్  చేసిన పొరపాటే భారత్ కొంపముంచింది అనే విషయం తేలింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం అంపైర్ చేసిన ఘోరమైన తప్పిదంఫై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు నెటిజన్లు. కె.ఎల్.రాహుల్ నో బాల్ లో బౌల్డ్ అయ్యాడని అది నాట్ ఔట్ అంటూ ఫోటోలు షేర్ చేస్తున్నారు. మూడు పరుగుల వద్ద కె.ఎల్.రాహుల్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో షాహీన్ అఫ్రిది ఏకంగా లైన్ దాటి బౌలింగ్ చేసాడు. అది కచ్చితంగా నో బాల్ అని దీనిని ఫీల్డ్ అంపైర్, థర్డ్ అంపైర్  గమనించక పోవడంతో భారత్కు ఎంతో నష్టం వాటిల్లింది అంటూ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: