నిన్నటి నుండి సౌతాఫ్రికాలోని సెంచూరియన్ వేదికగా ఇండియా మరియు సౌతాఫ్రికా ల మధ్య మొదటి టెస్ట్ జరుగుతున్న విషయం తెలిసిందే. మొదట టాస్ గెలిచి కెప్టెన్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నిన్న ఓవరాల్ గా చూసుకుంటే ఇండియా డామినేషన్ ఎక్కువ అని చెప్పాలి. ఓపెనర్ గా వచ్చిన కె ఎల్ రాహుల్ ఒక్కడే సెంచరీ సాధించి నాట్ అవుట్ గా ఉన్నాడు. అతనికి రహానే నుండి చక్కని సహకారం లభిస్తోంది. మిగతా వారిలో మయాంక్ అగర్వాల్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, వెంటనే వచ్చిన ఛతేశ్వర్ పుజారా మరోసారి డక్ అవుట్ అయ్యి తన పూర్ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. ఇక కెప్టెన్ కోహ్లీ కి మంచి ఆరంభమే దక్కింది కానీ మంచి స్కోర్ గా మలచడంలో విఫలం అయ్యాడు.  

ఇక రాహుల్ ఒక్కడే సెంచరీ సాధించి 122 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మొదటి రోజును ముగించాడు. ఈ రోజు కనీసం ఒక్క ఓవర్ కూడా జరగకుండా ముగిసిపోయింది. ఉదయం నుండి ఎడతెరిపిలేని వర్షంతో గ్రౌండ్ మొత్తం నీటితో నిండిపోయింది. టీమిండియా ఒకింత నిరాశ పడి ఉంటుంది. ఇక మూడు రోజులే మిగిలి ఉండడంతో కనీసం రేపు అయినా మ్యాచ్ జరుగుతుందా అనే సందేహంలో ఉంది. రేపు కనుక మ్యాచ్ జరగకపోతే విజయావకాశాలు తక్కువే. కాగా కె ఎల్ రాహుల్ కెరీర్ లో ఇప్పటి వరకు 41 టెస్ట్ లు ఆడాడు.

కానీ ఇతని వ్యక్తిగత అత్యధిక స్కోర్ 199 పరుగులు మాత్రమే. కనీసం ఈ మ్యాచ్ లో అయినా డబల్ సెంచరీ చేస్తాడేమో చూడాలి. కె ఎల్ రాహుల్ ఈ సిరీస్ లో వైస్ కెప్టెన్ గా ఎంపిక కావడం వలన అదనపు బాధ్యత పడింది. కాబట్టి ఎక్కడా అజాగ్రత్తకు పోకుండా ఆచితూచి ఆడుతున్నాడు. మరి రాహుల్ కు డబల్ సెంచరీ చేసే అదృష్టం దక్కుతుందా లేదా అనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: