
టెస్టు సిరీస్ కోల్పోయిన టీమిండియాకు ప్రస్తుతం మరో బిగ్ షాక్ తగిలింది. నిన్నటి వరకు టెస్టు ర్యాకింగ్స్లో టీమిండియా టాప్ ప్లేస్లో ఉంది. ఇప్పుడు ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో మొదటి స్థానం కోల్పోయింది టీమిండియా. భారత జట్టు స్థానాన్ని ఇటీవల యాషెస్ సిరీస్ను 4-0తో గెలుచుకున్న ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. ఇక భారత్పై టెస్టు సిరీస్ గెలిచిన సౌతాఫ్రికా కూడా ర్యాంకింగ్స్లో పైకి ఎగబాకింది. సౌతాఫ్రికా టెస్టు సిరీస్ ఓటమితో టీమిండియా రెండు స్థానాలు దిగజారి పోయింది. టాప్ ప్లేస్ నుంచి మూడో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం భారత్ ఖాతాలో 116 పాయింట్లు ఉన్నాయి. ఇక భారత్పై 2-1 తేడాతో టెస్టు సిరీస్ గెలిచిన సౌతాఫ్రికా జట్టు టెస్టు ర్యాంకింగ్స్లో ఐదో స్థానానికి ఎగబాకింది. సఫారీల ఖాతాలో 101 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. యాషెస్ సిరీస్లో ఐదు టెస్టులు ఆడిన ఆస్ట్రేలియా.. నాలుగు మ్యాచ్ల్లో గెలిచింది. దీంతో ప్రస్తుతం ఆస్ట్రేలియా ఖాతాలో 119 పాయింట్లు చేరాయి. ఇక బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ డ్రా చేసుకున్న న్యూజీలాండ్ జట్టు 117 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.