
వరుస విజయాలతో సెమీస్ బెర్త్ ను దక్కించుకోవడానికి దూసుకెళ్తున్న విండీస్ కు అడ్డుకట్ట వేసింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా మహిళలు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. బదులుగా 318 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ ఓపెనర్లు డాటిన్ మరియు మాథ్యూస్ లు ఇండియా బౌలర్ లను చీల్చి చెండాడారు. ఒక దశలో కేవలం 12 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 100 పరుగులు చేశారంటే పరిస్థితి ఎలా ఉందో చూడండి. అయితే వీరిద్దరి జోరుకు బ్రేక్ లు వేసింది స్నేహ రాణా... జోరుమీదున్న డాటిన్ ను మొదట ఔట్ చేసి ఇండియా శిబిరంలో ఉత్సాహాన్ని నింపింది.
ఇక ఆ తర్వాత ఏ దశలోనూ విండీస్ లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించలేదు. అలా కేవలం 40.3 ఓవర్లలో 162 పరుగులకు చాప చుట్టేసింది. దీనితో ఇండియా 155 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా కన్నా మెరుగైన రన్ రేట్ ను సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇదే ఆటతీరును కొనసాగిస్తే లాస్ట్ టైం మిస్ అయిన్ వరల్డ్ కప్ ఈ సారి దక్కుతుంది.