ఒకవైపు ముంబై ఇండియన్స్.. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్.. ఐపీఎల్లో దిగ్గజాలుగా కొనసాగుతున్న ఈ రెండు జట్లు ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో మాత్రం మునుపెన్నడూ లేనివిధంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటూన్నాయి. ఐపీఎల్ లోకి కొత్తగా వచ్చిన  జట్లు వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంటే.. ఐపీఎల్ చరిత్రలో  పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ కి కేరాఫ్ అడ్రస్ అయిన ఈ రెండు జట్లు మాత్రం చిట్ట చివరన ఉన్నాయి. ఇండియన్స్ వరుసగా ఆరో పరాజయాన్ని చవిచూసింది. ఒక మ్యాచ్ లో గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ అభిమానుల్లో కొత్త ఊపిరి నింపింది.


 ఇక విజయ పరంపర కొనసాగిస్తుందని అభిమానుల ఆశలు పెట్టుకున్నారు. కాగా ఇటీవలే చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇక ఈ మ్యాచ్లో చెన్నై మరోసారి నిరాశ పరిచింది. ఇప్పటివరకు ఆడినా 6 మ్యాచ్లలో ఒక మ్యాచ్లో మాత్రమే గెలిచి ఐదు మ్యాచ్ల్లో ఓడి పోయింది. దీంతో ప్లే ఆఫ్ చేరాలంటే ప్రతి మహిళ తప్పక గెలవాల్సిన పరిస్థితి వచ్చింది. కాగా చెన్నై సూపర్ కింగ్స్ ఐదవ ఓటమిపై జట్టు కెప్టెన్ రవీంద్ర జడేజా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్ మేం అద్భుతంగానే ఆరంభించాము. ఇక మా బౌలింగ్ విభాగం 6 ఓవర్ల వరకు గొప్పగా బంతులు వేసింది.


 ఓకే గుజరాత్ టైటాన్స్  గెలుపు డేవిడ్ మిల్లర్ కే దక్కుతుంది. అతను మంచి షాట్లు ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు. తొలుత మేము బ్యాటింగ్ చేసినప్పుడు వికెట్స్ స్పందించిన తీరు బాగోలేదు. బంతి ఎంత వేగంగా రాలేదు. అలాంటప్పుడు మేం సాధించిన 169 పరుగుల గుజరాత్కు సరిపోతాయని భావించాము. కానీ చివరి 5 ఓవర్లలో మా ప్రణాళికలు పనిచేయలేదు. సరైన ప్రణాళికలు అమలు చేయలేక పోయాము అంటూ రవీంద్ర జడేజా చెప్పుకొచ్చాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్ లో క్రిస్ జోర్డాన్ కు ఉన్న అనుభవంతోనే అతనికి బౌలింగ్ ఇచ్చాము. కానీ ప్లాన్ సక్సెస్ కాలేదు అంటూ రవీంద్ర జడేజా చెప్పుకొచ్చాడు...

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl