ప్రస్తుతం టీమిండియా జట్టులో ఇంగ్లండ్ పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్ పర్యటనలో ప్రతిష్ఠాత్మకమైన టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది. ఈ టెస్ట్ ముగిసిన వెంటనే వన్డే, టి20 సిరీస్ లు ఆడబోతుంది. ఇదిలా ఉంటే మరోవైపు భారత మహిళల  జట్టు శ్రీలంక పర్యటనలో ఉన్న అన్న విషయం తెలిసిందే. లంక పర్యటనలో భాగంగా టి20 సిరీస్ పాటు వన్డే సిరీస్ కూడా ఆడుతుంది టీమ్ ఇండియా. ఈ క్రమంలోనే సొంతగడ్డపై శ్రీలంకను చిత్తు చిత్తుగా ఓడించింది అనే విషయం తెలిసిందే.


 ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే టి20 సిరీస్ ను కైవసం చేసుకుంది టీమిండియా జట్టు. అయితే మూడో మ్యాచ్లో కూడా గెలిచి శ్రీలంక నుంచి క్లీన్స్వీప్ చేస్తుందని అందరూ అనుకున్నారు. ఊహించని రీతిలో మూడో మ్యాచ్లో విజయం సాధించిన శ్రీలంక జట్టు పరువు నిలబెట్టుకుంది అని చెప్పాలి. ఇప్పుడు వన్డే సిరీస్లో కూడా మరోసారి టీమిండియా సత్తా చాటింది. వన్డే సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్లో విజయం సాధించిన టీమిండియా జట్టు ఇక రెండో వన్డే మ్యాచ్లో బరిలోకి దిగింది. రెండో వన్డే మ్యాచ్లో కూడా విజయం సాధించింది.


 దీంతో అందరూ అనుకున్నట్టు గానే ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే వన్డే సిరీస్ కూడా కైవసం చేసుకుని సొంతగడ్డపై శ్రీలంక జట్టుకు షాకిచ్చింది టీం ఇండియా. టీమిండియా మహిళల జట్టు సమిష్టిగా రాణించడంతో ఇక ఈ విజయం సాధ్యమైందని చెప్పాలి. రెండో వన్డేలో భాగంగా శ్రీలంక 173 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 25.4 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా 174 పరుగులు చేసి టార్గెట్ చూపించింది. 2-0 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. ఇక మూడో వన్డేలో గెలిచి క్లీన్స్వీప్ చేయాలనే లక్ష్యంతో ప్రస్తుతం టీమిండియా ఉంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: