ఏకంగా టీమిండియా 20 ఓవర్లలో 166 పరుగులు చేసింది. ఇక ఇలాంటి టార్గెట్ ను టీమిండియా లాంటి జట్టు ఎంతో అలవోకగా కాపాడుకోగలదు అని చెప్పాలి. అయితే లీగ్ దశ మ్యాచ్ లో మాత్రం ప్రత్యర్ధులపై నిప్పులు చెరిగిన భారత బౌలర్లు అటు కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్లో మాత్రం చేతులెత్తేశారు. అటు ప్రత్యర్థి జట్టును పరుగులు ఇవ్వకుండా కట్టడి చేయాల్సింది పోయి సిక్సర్లు ఫోర్లు ఇచ్చి ఇక పరుగులను సమర్పించుకున్నారు అని చెప్పాలి. దీంతో ఒక వికెట్ కూడా పడగొట్టలేక పేలవమైన ప్రదర్శన చేశారు. తద్వారా ఏకంగా టీమిండియా పై 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది ఇంగ్లాండు జట్టు.
టీమ్ ఇండియా వైఫల్యానికి కారణం ఏంటి అన్నదానిపై విశ్లేషకులు ఎన్నో రివ్యూలు ఇస్తున్నారు. ముఖ్యంగా సెమీఫైనల్ లో టీమిండియా చేసిన ఒక పెద్ద తప్పిదమే ఇక జట్టు ఓటమికి కారణమైనట్టు కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు. అక్షర్ పటేల్ స్థానంలో స్పిన్నర్ చాహాల్ ను ఆడించి ఉంటే తప్పకుండా ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడుతున్నారు. ఇంగ్లాండు రిస్ట్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ నాలుగో ఓవర్లు వేసి 20 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన సూర్య కుమార్ వికెట్ పడగొట్టాడు. మరో స్పిన్నర్ లివింగ్ స్టోన్ మూడు ఓవర్లలో 21 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. కానీ భారత స్పిన్నర్లు అక్షర్ అశ్విన్ లు మాత్రం తేలిపోయారు. అదే రిస్ట్ స్పిన్నర్ చాహల్ కు ఛాన్స్ ఇచ్చి ఉంటే అతను ఎంతో కీలక పాత్ర వహించేవాడని.. అతనికి ఆ సత్తా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి