ఆస్ట్రేలియా ఆట తీరు చూస్తే ఇక సెమి ఫైనల్ అడుగు పెట్టడం కష్టమే అని కొంతమంది అభిమానులు కూడా నిరాశలో మునిగిపోయారు. కానీ ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్న ఆస్ట్రేలియా వరుసగా నాలుగు మ్యాచ్లలో విజయాన్ని సాధించింది. ఈ క్రమంలోనే పాయింట్లు పట్టికలో కూడా అంతకందుకు పైకి దూసుకొచ్చి.. ఇక ఇప్పుడు మూడో స్థానంలో కొనసాగుతుంది. ఇలా సెమీఫైనల్కు ఆస్ట్రేలియా దూరమవుతున్న నేపథ్యంలో ఆ జట్టుకు మాత్రం ఊహించని ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఇప్పటికే జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న మ్యాక్స్వెల్ ఇటీవల ఒక ఘటనలో గాయాల బారిన పడటంతో జట్టుకు దూరమయ్యాడు అన్న విషయం తెలిసిందే.
అయితే అతని స్థానంలో ఎవరిని రీప్లేస్ చేయాలా అని ఆలోచిస్తున్న సమయంలో ఇప్పుడు ఆస్ట్రేలియాకు మరో ఎదురు దెబ్బ తగిలింది అన్నది తెలుస్తుంది. స్టార్ ఆల్ రౌండర్ మిచెల్ మార్చ్ కూడా స్వదేశానికి వెళ్ళాడట. వ్యక్తిగత కారణాలతో అతను ఇక ఇండియా నుండి పెర్త్ కి వెళ్ళాడు అన్నది తెలుస్తుంది. అయితే అతను తిరిగి మళ్ళీ జట్టులోకి చేరడం విషయంలోనూ అనిశ్చితి నెలకొంది అని చెప్పాలి. కాగా శనివారం ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లాండ్ తో మ్యాచ్ ఆడబోతుందట. దీంతో ఇద్దరు కీలక ఆటగాళ్ళు దూరం కావడంతో ఆస్ట్రేలియా వ్యూహాలు మొత్తం తారుమారు అయిపోయాయి అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి