భారత క్రికెట్లో టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్లు ఎవరు అంటే ఇప్పుడైతే వీళ్ళ పేరు వినిపించడం లేదు. కానీ ఒకప్పుడు ఇలాంటి ప్రశ్న వచ్చింది అంటే చాలు క్రికెట్ విశ్లేషకులు దగ్గర నుంచి ప్రేక్షకుల వరకు ప్రతి ఒక్కరు కూడా భారత వెటరన్ ప్లేయర్లు అయినా చటేశ్వర్ పూజార అజంక్య రహనే పేర్లు చెప్పేవారు. ఎందుకంటే ఈ ఇద్దరు మిగతా ఫార్మట్ లలో చోటు సంపాదించుకోలేకపోయేవారు. కానీ భారత జట్టు ఎక్కడైనా టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది అంటే చాలు ఇక ఇద్దరు ప్లేయర్లు లేకుండా అసలు టీమ్ ఇండియా జట్టు కనిపించేది కాదు. ఇక టెస్ట్ ఫార్మాట్ కు సరిగ్గా సరిపోయే ఆట తీరుతో ఇద్దరు ఒకరకంగా సుదీర్ఘమైన ఫార్మాట్ లో జట్టును ముందుకు నడిపించారు అని చెప్పాలి.


 సుదీర్ఘమైన ఫార్మాట్ కు సరిపోయే ఆట తీరుతో నెమ్మదిగా ఆడే పుజార.. అయితే టీమ్ ఇండియా నయా వాల్ అనే ఒక బిరుదును కూడా సొంతం చేసుకున్నాడు. ఇక అజంక్య రహనే అయితే విరాట్ కోహ్లీకి డిప్యూటీగా ఎన్నో రోజులపాటు భారత జట్టును ముందుకు నడిపించాడు. కోహ్లీకి విశ్రాంతి ప్రకటించిన సమయంలోను జట్టు కెప్టెన్సీ చేపట్టి అద్భుతమైన విజయాలు అందించాడు అని చెప్పాలి. అయితే గత కొంతకాలం నుంచి వీరికి భారత జట్టులో చోటే లేకుండా పోయింది. ప్రేక్షకులు కూడా దాదాపు ఈ ఇద్దరిని మరిచిపోయారు అని చెప్పాలి.


 అయితే ఇక ఇన్ని రోజుల తర్వాత మరోసారి ఈ సీనియర్ క్రికెటర్లకు సంబంధించిన చర్చ తెర మీదకి వచ్చింది. టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ అయిన ఈ ఇద్దరు కెరియర్ ముగిసినట్లే కనిపిస్తుంది. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా తో టెస్టు సిరీస్ ఆడబోయే భారత జట్టు వివరాలను ఇటీవల బీసీసీఐ ప్రకటించింది. అయితే జట్టు ఎంపికలో ఇద్దరు సీనియర్ ప్లేయర్లను బీసీసీఐ పరిగణలోకి తీసుకోలేదు. ప్రస్తుతం కౌంటీ క్రికెట్లో ఇద్దరు సీనియర్లు రాణిస్తున్నారు. అయినప్పటికీ భారత జట్టులో విఫలమవుతున్నారు. ఈ ఏడాది జూన్ లో ఆస్ట్రేలియా తో టెస్ట్ పూజారకు చివరిది కాగా.. జూలైలో వెండితో టెస్ట్ రహానేకు చివరిది.

మరింత సమాచారం తెలుసుకోండి: