2024 ఐపీఎల్ సీజన్లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ జట్టు చెత్త ప్రదర్శనలతో నిరాశ పరుస్తూ ఉంది అని చెప్పాలి. అయితే మొదట్లో శిఖర్ ధావన్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన ఈ టీం.. మధ్యలో శ్యాంకరన్ సారథ్యంలో మ్యాచ్లు ఆడుతుంది. ఈ క్రమంలోనే కెప్టెన్లు మారిన ఆ జట్టుకు అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. పలువురు స్టార్ ప్లేయర్లు జట్టులో ఉన్నప్పటికీ పంజాబ్ కింగ్స్ కి మాత్రం అస్సలు అదృష్టం కలిసే రావడం లేదు. ఇప్పుడు వరకు ఈ ఐపీఎల్ టోర్నీలో 14 మ్యాచ్లు ఆడిన పంజాబ్ కింగ్స్ జట్టు.. కేవలం నాలుగు మ్యాచ్లు మాత్రమే గెలిచింది.


 దీంతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో కొనసాగుతూ ఉంది అని చెప్పాలి. ఇక ప్రస్తుతం ఆ జట్టుకు ఉన్న రన్ రేట్ పాయింట్లు చూసుకుంటే ఇక ఈసారి టైటిల్ కొట్టడం కాదు కనీసం ప్లే ఆఫ్ లో అడుగు పెట్టడం కూడా కష్టంగానే కనిపిస్తుంది అని చెప్పాలి. అయితే పంజాబ్ కింగ్స్ జట్టుకి ఓనర్ గా కొనసాగుతున్న బాలీవుడ్ హీరోయిన్ ప్రీతిజింతా తమ జట్టు మ్యాచ్ ఆడినప్పుడల్లా సపోర్ట్ చేసేందుకు స్టేడియం కు వస్తున్నారు. ఇక తమ టీం వరుస ఓటములతో సతమతమవుతూ ఉండడంతో ఆమె కూడా నిరాశలో మునిగిపోతున్నారు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఈ ఐపీఎల్ సీజన్లో పంజాబ్ కింగ్స్ జట్టు వరుస ఓటమిలపై షాకింగ్ కామెంట్స్ చేశారు ఆ జట్టు కో ఓనర్ ప్రీతిజింతా. ఇక సోషల్ మీడియా వేదికగా ఈ విషయంపై స్పందించారు  మాకు సంతోషంగా లేదు. చివరి బంతి వరకు వచ్చి నాలుగు మ్యాచ్లలో కూడా ఓడిపోయాం. గాయం కారణంగా కెప్టెన్ శిఖర్ ధావన్ ఆడటం లేదు. కొన్ని మ్యాచ్లను అద్భుతంగా ఆడాము. మరికొన్ని మ్యాచుల్లో మా మార్క్ చూపించలేకపోయాం. హోమ్ గ్రౌండ్ మ్యాచ్లలోనూ గెలిస్తేనే ముందుకు వెళ్ళగలం. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా మాకు సపోర్టుగా నిలుస్తున్న అభిమానులందరికీ కూడా ధన్యవాదాలు అంటూ ప్రీతి జింటా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: