ఐ పీ ఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024) చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే ప్లే ఆప్స్ లో కొన్ని మ్యాచ్ లు కూడా పూర్తి అయ్యాయి. అందులో భాగంగా మొదటి ప్లే ఆఫ్ మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్ మరియు సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగగా , అందులో కోల్కతా మ్యాచ్ గెలిచి ఫైనల్ కి వెళ్ళగా , సన్రైజర్స్ ఓటమి పాలయ్యింది. నిన్న రాజస్థాన్ రాయల్స్ మరియు బెంగళూరు రాయల్ చాలెంజర్స్ మధ్య మ్యాచ్ జరగగా ఇందులో రాజస్థాన్ రాయల్స్ గెలిచింది.

బెంగళూరు రాయల్ చాలెంజర్స్ (ఐ పీ ఎల్ 2024) నుండి నిష్క్రమించింది. ఇక రేపు సన్రైజర్స్ హైదరాబాద్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో వారు ఫైనల్ కు వెళ్తారు. అలాగే ఫైనల్ లో కోల్కతా నైట్ రైడర్స్ వారు తలబడతారు. ఇకపోతే బెంగళూరు జట్టు మొదటి ఎనిమిది మ్యాచ్ లలో ఒకటి మాత్రమే గెలిచింది. ఆ తర్వాత ఆరు మ్యాచ్ లకి 6 కూడా గెలిచే ప్లే ఆప్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ నిన్న జరిగిన మ్యాచ్ లో ఓడిపోయి సీజన్ నుంచి నిష్క్రమించింది.

ఇలా బెంగుళూరు జట్టు ప్లే ఆప్స్ లో రాజస్థాన్ పై ఓడిపోవడంతో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు అంబటి రాయుడు కౌంటర్ ఇచ్చారు. ఆయన తాజాగా స్పందిస్తూ ... ఫ్యాషన్ , సెలబ్రేషన్స్ తో ట్రోఫీలు రావు. ప్లే ఆప్స్ కి చేరితేనే టైటిల్స్ వస్తాయి అనుకోవడం పొరపాటే అవుతుంది. టోర్నీ లో అన్ని మ్యాచ్ లను బాగా ఆడితేనే టైటిల్ కొడతారు. చెన్నై పై గెలిస్తేనే (ఐ పీ ఎల్) లో ట్రోఫీ గెలుస్తామనే భ్రమలో ఉందద్దు అని ఆయన వ్యాఖ్యానించారు. ఇక రాయుడు చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: