తెలుగు సినీ ప్రేక్షకులకు అలనాటి హీరోయిన్, జబర్దస్త్ జడ్జి రోజా ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇక ఇటీవల ఆంధ్రప్రదేశ్ మంత్రిగా తన ప్రమాణ స్వీకారానికి కూడా చేసిన సంగతి అందరికీ తెలిసిందే. తను ఎప్పటినుంచో కోరుకుంటున్న కల నెరవేరడంతో ఇక జబర్దస్త్ షో కి గుడ్ బై చెప్పేసినట్లుగా వార్తలు వినిపించాయి. అంతేకాకుండా జబర్దస్త్ షో లో కూడా తను ఈ సమయాన్ని చాలా మిస్ అవుతున్నాను అంటూ ఒక ఎమోషనల్ విషయాన్ని కూడా తెలియజేసింది. తాను ఎప్పటినుంచో కోరుకున్న మంత్రి పదవి కోసం ఈ జబర్దస్త్ షో తో పాటుగా ఏ ఇతర ఈవెంట్లలో కనిపించను అంటూ స్టేజి పైన చెప్పి చాలా ఎమోషనల్ అయిన రోజా.

అలా జబర్దస్త్ లో నుంచి వెళ్లిపోతున్న సమయంలో మల్లెమాల వారు కూడా రోజాకు శాలువా కప్పి, ఫ్లవర్ బొకే తో ఆమెను సత్కరించడం జరిగింది. ఆ తర్వాత అనంతరం మల్లెమాల టీమ్ తో పాటు జబర్దస్త్ లో ఉన్న మరికొంత మంది కమెడియన్స్ కూడా రోజా గురించి తన తో ఉన్న అనుబంధం గురించి తెలియజేశారు. ఇక ఇమే జబర్దస్త్ నుంచి వెళ్లిపోవడంతో ఆమె స్థానంలో నటి ఇంద్రజ ఎంటర్ అవుతుందని అందరూ అనుకొన్నారు.

అయితే ఇప్పుడు తాజాగా విడుదలైన ప్రోమోలో కొందరు చూసి చాలా ఆశ్చర్య పోతున్నారు. మరి కొందరు మాత్రం చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నట్లుగా తెలియజేశారు. రోజా ప్లేస్ లో కేవలం రోజా నే కనిపించడంతో ఆమె అభిమానులు సైతం ఆనందపడుతున్నారు. మరికొందరు మాత్రం తను ఆ సీట్లో కనిపించడంతో షాక్ అయ్యారు. అయితే మళ్లీ రోజా రీఎంట్రీ ఇచ్చిందా అన్నట్లుగా మాట్లాడుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతుంది. అయితే ఈ ప్రోమో కొత్త ఎపిసోడ్ కు సంబంధించిన లేదంటే ఈ షూటింగ్ చాలా రోజుల క్రితం చేసి ఉండొచ్చు మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: