బుల్లితెరని , వెండితెర నటీనటులు ఎక్కువగా ఈమధ్య విడాకులు బాట పడుతున్నారు. ప్రేమించి వివాహం చేసుకున్న జంటలే ఈ మధ్యకాలంలో చాలా జంటలు విడిపోతున్నారు.. కొన్ని మనస్పర్ధలు కారణంగా విడిపోవడంతో పాటు మరొక పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధపడుతున్నారు.. అలా బుల్లితెర పైన యాక్టర్ గా కొనసాగుతూ మంచి పేరు సంపాదించిన నటుడు పవన్ సాయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. పవన్ తన భార్యతో విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు గల కారణం ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.



పలు రకాల సీరియల్స్ లో హీరోగా చేసిన పవన్ సాయి తన భార్య నుంచి విడాకులు తీసుకోబోతున్నారని తెలియడంతో అభిమానుల సైతం చాలా ఆందోళనకు గురవుతున్నారు. పవన్ సాయి  ముద్దమందారం, మొగలిరేకులు, శ్రావణ సమీరాలు తదితర సీరియల్స్ లో కూడా నటించి మంచి క్రేజ్ అందుకున్నారు.. ఈమధ్య నటనకు కూడా కాస్త దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.. ఆయన తన భార్య నుంచి విడిపోతున్నారనే విషయాన్ని ఆయనే  స్వయంగా (హింట్) అభిమానులతో చిచ్చాట్ నిర్వహిస్తున్న సమయంలో తెలియజేశారు.


అసలు విషయంలోకి వెళ్తే పవన్ సాయి అభిమానులతో చిట్ చాట్ నిర్వహిస్తున్న సమయంలో అన్నయ్య వదిన మధుమిత ఎలా ఉంది అని అడగగా.. అందుకు పవన్ స్పందిస్తూ.. తన చుట్టూ ఎవరూ లేరు ప్రస్తుతం తాను ఒంటరి వాడిని..ఒంటరి జీవితం నాకు ఎవరు తోడు లేరు అంటూ తెలియజేశారు. ఈ విషయం వల్లే పవన్ సాయి తన భార్య నుంచి విడిపోతున్నాడనే వార్తలకు మరింత బీజం పోసింది.. పవన్ సాయి ముద్దమందారం సీరియల్ లోని నటితో ఎఫైర్ పెట్టుకోవడం వల్ల తన భార్యతో గొడవలు జరిగాయని అందుకు విడాకులు కూడా తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎత్త నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయమైతే వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: