జబర్దస్త్, బిగ్ బాస్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది నటి రోహిణి. అయితే మొదట ఇమే పలు సీరియల్స్ లో కూడా నటించేది. ఆ తర్వాత జబర్దస్త్ లోకి వచ్చి అక్కడ లేడీ కమెడియన్ గా పేరు సంపాదించడంతో సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంది. తన కామెడీ టైమింగ్ తో అందర్నీ డామినేట్ చేసేది రోహిణి. అలా ఎన్నో రకాల వెబ్ సిరీస్లలో, కామెడీ చిత్రాలలో తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉన్నది. అంతేకాకుండా పలు రకాల ఈవెంట్లలో కూడా కనిపిస్తూ షోలలో కూడా కనిపిస్తూ అలరిస్తూ ఉన్నది రోహిణి. తాజాగా రోహిణి కి సంబంధించి ఒక క్రేజీ న్యూస్ బుల్లితెరపై వైరల్ గా మారుతున్నది.


అసలు విషయంలోకి వెళ్తే రోహిణి ఒక లగ్జరీ విల్లా కొనుగోలు చేసిందని అది కూడా హైదరాబాద్ శివారు ప్రాంతంలో కొనుగోలు చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీని విలువ సుమారుగా రూ.2 కోట్ల రూపాయల లోపు ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అయితే రోహిణి ఈ స్థాయికి ఎదగడం వెనక కూడా చాలా కష్టం ఉందని అభిమానులు తెలియజేస్తూ ఆమెకు కంగ్రాట్యులేషన్స్ తెలియజేస్తున్నారు.


ఒకప్పుడు చాలా చిన్న ఇంట్లో ఉన్న రోహిణి బిగ్ బాస్ కు రెండుసార్లు వెళ్ళింది.. అలా 20 లక్షల వరకు వచ్చిందట..అలా వచ్చిన డబ్బులను కూడా దాచుకొని , అటు జబర్దస్త్, ఇటు సినిమాలలో వచ్చిన డబ్బులతో సొంత ఇంటిని నిర్మించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం రోహిణి అటు వరుస సినిమాలతో పాటు, బుల్లితెర ప్రోగ్రామ్స్ తో సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నది. ఇలా అన్నిటితో పాటు యూట్యూబ్ ఛానల్ వల్ల కూడా కొంతమేరకు బాగానే సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది రోహిణి. మరి లగ్జరీ హౌస్ రోహిణి కొనిందని వార్తలపై ఎంత నిజం ఉందో రోహిణి క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: