సోష‌ల్ మీడియా ప్ర‌భావం పెర‌గ‌టంతో ఏదైనా వింత లేదంటే అనుకోనిది జ‌రిగి అది సెల్ ఫోన్ లో బందించారంటే అది వైర‌ల్ అవ్వాల్సిందే. ఇప్ప‌టి వ‌ర‌కూ అలా ఎన్నో వీడియోలు వైర‌ల్ అవ్వ‌డం వారికి గుర్తింపు రావ‌డం జ‌రింగింది. కాగా గ‌త రెండు రోజుల నుండి ఓ వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. ఇంత‌కీ ఆ వీడియోలో ఏం ఉంది. వైర‌ల్ అవ్వ‌డానికి కార‌ణం ఏంట‌న్న‌ది ఇప్పుడు చూద్దాం. మాల్దీవుల‌కు వచ్చిన ఓ బ్రిటిష్ పర్యాటకుల జంట వీడియో ప్ర‌స్తుతం వైరల్ గా మారింది. మాల్దీవుల‌కు ఎంజాయ్ చేసేందుకు వచ్చిన జంట చిత్త‌డి నేల గుండా నడుచుకుంటూ వెళుతోంది. కాగా మార్గమధ్యలో వారికి ఒక బురదగుంట అడ్డు వచ్చింది. దాంతో ముందుకు వెళ్లేందుకు దారి లేక బురద గుంట దాటాల్సి వచ్చింది. 

అయితే ముందుగా భర్త ఆ బురద గంటను దాటేందుకు సాహసం చేసి ఆ బురదలో మునిగిపోయాడు. అయితే భార్య రక్షించ కుండా పగలబడి నవ్వుతోంది. ప్రస్తుతం వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే.... బ్రిటిష్ దంప‌తులు లూయిస్ మ‌రియు రేచల్ మాల్దీవుల్లో ని ఫువాహ్ములా ద్వీపంలో గడపడానికి వచ్చారు. వారు నడుచుకుంటూ వెళుతుండగా ఓ బురద గుంట అడ్డువచ్చింది. దాంతో చేసేది లేక భర్త తన చెప్పులు తీసివేసి మెల్లిగా అడుగులు వేస్తారు. లూయిస్ ఎంతో జాగ్రత్తగా ఆచితూచి నడుస్తాడు. కానీ ఆ బురద గుంట ఎక్కువగా లోతు ఉంటడటం తో ఒక్కసారిగా అందులోనే మునిగి పోతాడు. 

అతడు కనిపించకుండా పూర్తిగా మునిగిపోయినా భార్య మాత్రం అతడికి సహాయం చేయకుండా నవ్వడం వీడియోలో వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మిలియన్స్ వ్యువ్స్ వస్తున్నాయి. మొద‌ల ఈ వీడియో టిక్ టాక్ లో ట్రెండింగ్ లోకి వ‌చ్చింది. ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ లోనూ దీన్ని పోస్ట్ చేశారు. కాగా ఈ పోస్ట్ కి రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. భర్త మునిగిపోతుంటే భార్య న‌వుతోందని.. భార్యలు అంతే అని కొందరు కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు అంతసేపు నీటిలో ఏం చేశావని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కావాలనే ఈ వీడియో తీసినట్టు ఉందని కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు.



 

మరింత సమాచారం తెలుసుకోండి: