అయితే ముందుగా భర్త ఆ బురద గంటను దాటేందుకు సాహసం చేసి ఆ బురదలో మునిగిపోయాడు. అయితే భార్య రక్షించ కుండా పగలబడి నవ్వుతోంది. ప్రస్తుతం వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే.... బ్రిటిష్ దంపతులు లూయిస్ మరియు రేచల్ మాల్దీవుల్లో ని ఫువాహ్ములా ద్వీపంలో గడపడానికి వచ్చారు. వారు నడుచుకుంటూ వెళుతుండగా ఓ బురద గుంట అడ్డువచ్చింది. దాంతో చేసేది లేక భర్త తన చెప్పులు తీసివేసి మెల్లిగా అడుగులు వేస్తారు. లూయిస్ ఎంతో జాగ్రత్తగా ఆచితూచి నడుస్తాడు. కానీ ఆ బురద గుంట ఎక్కువగా లోతు ఉంటడటం తో ఒక్కసారిగా అందులోనే మునిగి పోతాడు.
అతడు కనిపించకుండా పూర్తిగా మునిగిపోయినా భార్య మాత్రం అతడికి సహాయం చేయకుండా నవ్వడం వీడియోలో వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మిలియన్స్ వ్యువ్స్ వస్తున్నాయి. మొదల ఈ వీడియో టిక్ టాక్ లో ట్రెండింగ్ లోకి వచ్చింది. ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ లోనూ దీన్ని పోస్ట్ చేశారు. కాగా ఈ పోస్ట్ కి రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. భర్త మునిగిపోతుంటే భార్య నవుతోందని.. భార్యలు అంతే అని కొందరు కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు అంతసేపు నీటిలో ఏం చేశావని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కావాలనే ఈ వీడియో తీసినట్టు ఉందని కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు.