ఇక అసలు విషయానికి వస్తే.. రాత్రి సమయాలలో వాట్సాప్ సేవలను నిలిపివేస్తున్నామని అన్నట్లుగా కేంద్రం తెలిపిందని వార్తలు ఎక్కువగా వినిపించాయి. అది కూడా రాత్రి 11:30 నుండి మరల ఉదయం 6 గంటల వరకు నిలిపివేస్తుంది అన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అని ఒక వార్త బాగా పాపులర్ అయింది సోషల్ మీడియాలో. అయితే ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ దానిమీద తగిన సమాచారాన్ని విడుదల చేసింది.
ఇక వాట్సాప్ సేవలను రాత్రిపూట నిలిపివేస్తుంది అన్నట్లుగా వార్తలు రావడంతోపాటు గా.. తిరిగి మనం వాట్సాప్ వాడుకోవాలంటే అందుకు నెలవారి చార్జీలు కూడా ముట్ట చెప్పవలసి ఉంటుందని ఒక న్యూస్ బయటికి వచ్చింది. అయితే ఈ విషయాన్ని కేంద్రం పరిశీలించగా ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. ఈ వార్తలన్నీ ఒట్టి ఫేక్ అని తీసి పారేసింది.