అయితే ఇప్పుడు ఇదే తరహాలో మరో వార్త సంచలనంగా మారింది.
కర్ణాటకలో వెలుగు చూసిన ఈ విషయం వివరాల్లోకి వెళితే... . ప్రముఖ అంతర్జాతీయ చాక్లెట్ దిగ్గజ సంస్థల్లో క్యాడ్బరీ సంస్థ ఒకటి. అయితే ఈ కంపెనీ నుండి తయారు అయిన ఖరీదైన(రూ.89) చాక్లెట్ లను కొనుగోలు చేసిన ఒక కస్టమర్ చాక్లెట్ తిందామని ఓపెన్ చేయగా చాక్లెట్ చూసి షాక్ అయ్యాడు. ఆ చాక్లెట్ ను విప్పగానే అందులో పురుగులు కనిపించాయి. దాంతో షాక్ అయిన ఆ వ్యక్తి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయడం మంచిది కాదని భావించి ఈ విషయంపై మొదట సంస్థకు కంప్లైంట్ చేయగా వారు సరిగా స్పందించక పోవడంతో ఆ తరవాత కోర్టును ఆశ్రయించాడు.
అయితే ఇది ఇప్పటి విషయం కాదు 2016లో కర్ణాటకలో జరిగింది. అయితే ఇప్పుడు ఈ విషయంపై తీర్పు రావడం తో మరోసారి హైలెట్ అయ్యింది. ఆ వ్యక్తి 2016 అక్టోబరు 26న బెంగళూరులోని అర్బన్ జిల్లా వినియోగదారుల కోర్టు ను ఆశ్రయించి ఈ విషయం పై కేసు వేశాడు. అయితే ఇది క్యాడ్ బరీ కంపెనీకి ఒక షాక్ అని చెప్పాలి. మరి ఈ విషయం ఆరేళ్ళ తర్వాత తీర్పుతో వెలుగులోకి రావడంతో మళ్ళీ చాకోలెట్ సేల్స్ పై ఏమైనా ప్రభావం చూపిస్తుందా అంటూ ఆందోళనలో ఉన్నారు. అయితే ఇవన్నీ ఇంతకు ముందు చాలానే వచ్చినా.. ఎవ్వరూ వీటిని పెద్దగా పట్టించుకోలేదు. మరి ఏమి జరుగుతుందో తెలియాలంటే సెకండ్ క్వార్టర్ సేల్స్ రావాల్సి ఉంది.