సాధారణంగా అడవుల్లో అత్యంత ప్రమాదకరమైన జీవులలో పులులు కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే పులులు వేటాడే విధానం ఎంతో భయంకరంగా ఉంటుంది. ఇక ఒక్కసారి అవి వేటాడాలి అనుకొని ఒక జంతువును సెలెక్ట్ చేసుకున్నాయ్ అంటే చాలు ఆ జంతువుకు అదే చివరి రోజు అవుతుంది అనడంలో సందేహం లేదు. భారీ ఆకారమున్న జంతువులను సైతం ఎంతో అలవోకగా వేటాడుతూ ఇక తనకు ఆహారంగా మార్చుకుంటూ ఉంటాయి పులులు. పులులు  ఎంత భయంకరంగా వేటాడుతాయి అన్నదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలానే ప్రత్యక్షమయ్యాయి అని చెప్పాలి.


 అయితే పులులు కొన్ని కొన్ని సార్లు గేదెలను వేటాడటమే కాదు.. ఏకంగా గేదెల గుంపు ప్రమాదకరమైన పులులను కూడా భయపెట్టడం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటిదే అని చెప్పాలి. ఐక్యమత్యమే మహాబలం అని మనం ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాం. కలిసికట్టుగా పోరాడితే ఏదైనా సాధించగలం అని దీనికి అర్థం వస్తుంది. అయితే ఇది ముమ్మాటికి నిజం అనే నిరూపించే ఘటన ఇక్కడ వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఇప్పుడు వరకు పులి గేదెలపై దాడి చేసి చంపడమే చూసాం. కానీ ఏకంగా గేదెల గుంపు పులిని చంపడం అయితే ఇక్కడ వైరల్ గా మారిపోయిన వీడియోలో చూడవచ్చు.



 ఇప్పుడు ట్విట్టర్లో వైరల్ గా మారిపోయిన వీడియో చూస్తే మీరు కూడా పరేషాన్ అవుతారు. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా మూల్ తాలూకా పరిసరాల్లో కొంతకాలంగా పులి సంచరిస్తుంది. దీంతో స్థానికులందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే ఇటీవల ఉదయ్ తాలూకాలోని ఎస్కౌ గ్రామ పరిసరాల్లో ఓ పశువుల కాపరిపై పులి దాడికి ప్రయత్నించింది. అయితే చేతిలో ఉన్న గొడ్డలితో  ఎదురు తిరగడంతో అతని ప్రాణం నుంచి బయటపడ్డాడు. అయితే అటవీ పరిసరాలలో గడ్డి మేస్తున్న గేదెలపై పులి దాడి చేసింది. ఈ క్రమంలోనే గేదెలు భయంతో పరిగెత్తకుండా.. ఐక్యమత్యంగా ఉండి పులిని తమ కొమ్ములతో కుమ్మేసాయి. దీంతో పులికి తీవ్ర గాయాలయ్యాయి. చివరికి గాయపడిన క్రూరమృగాన్ని అటవీశాఖ అధికారులు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. చివరికి పులి పరిస్థితి విషమించడంతో  ప్రాణాలు కోల్పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: