ఓక జంట కొంత కాలంగా ప్రేమించుకుంటుంది. తదనంతరం వారి మధ్య కొన్ని కొన్ని విబేధాలు రావడంతో ఎవరికి వారు మాట్లాడకుండా ఉంటున్నారు. కానీ ఆ యువకుడు మాత్రం ఆ అమ్మాయిని మర్చిపోలేక తనను ఎలాగైనా దక్కించుకోవడానికి బెదిరించే ప్రయత్నం చేశాడు. చివరికి ఆ అమ్మాయి స్నానాల గదిలో పెన్ కెమెరా పెట్టాడు. కానీ ఆ యువతి చాకచక్యంగా ఆ పెన్ కెమెరాను గుర్తించింది. ఆ విషయాన్ని వారి తల్లిదండ్రులకు చెప్పింది. వారికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 


కడప జిల్లా రైల్వే కోడూరు మండల పరిధిలోని శెట్టిగుంట పంచాయతీకి చెందిన ఓ గ్రామంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన యువతీ యువకుడు కొంత కాలంగా ప్రేమించుకున్నారు. ఇటీవల వారిద్దరి మధ్య కొన్ని విభేదాలు రావడంతో దూరంగా ఉంటున్నారు. అయితే విభేదాల కారణంగా ప్రియురాలు తనను పట్టించుకోవడం లేదనే అక్కసుతో ఆ యువకుడు ఓ ప్లాన్ వేశాడు. 


ఇంటి బాత్రూంలో సీసీ కెమెరా పెడుతానంటూ ఆ అమ్మాయిని బెదిరించి చివరకు వారి స్నానాల గదిలో పెన్ కెమెరాను అమర్చాడు. ఆ యువతి బాత్రూం కి స్నానం చేయడానికి వచ్చి ఆ కెమెరాను తెలివిగా గుర్తించింది. ఆ యువతి వెంటనే కుటుంబ సభ్యులకు చెప్పగా వారు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఈ విషయం పై గ్రామ పెద్దలు మాట్లాడి రాజీ కుదిర్చారు.  

 
ఈ సంఘటన పై ఎస్సై వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. గ్రామానికి చెందిన యువకుడు యువతిని కెమెరాలు పెడుతానంటూ బెదిరించిన విషయం వాస్తవం. అతని వద్ద ఉన్న పెన్ను కెమెరా పని చేయడం లేదని మేము గుర్తించామని తెలిపారు. ప్రేమించిన యువతి మళ్లీ దగ్గర కావాలనే ఉద్దేశ్యంతో ఈ బెదిరింపులకు పాల్పడట్టు వారు తెలిపారు. ఇరువర్గాలు రాజీపడటంతో కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: