జపాన్ దేశానికి చెందిన ఫేమస్ ఆటోమొబైల్ కంపెనీ నిస్సాన్ కారులో సీట్ బెల్టులు ఇంకా స్టీరింగ్ వీల్ లో లోపాల కారణంగా కంపెనీ మొత్తం 4 లక్షలకు పైగా యూనిట్లను రీకాల్ చేసింది. అయితే ఈ లోపాలు ఎక్కువగా ఉత్తర అమెరికాలో గుర్తించారు. ఆ తర్వాత కంపెనీ అక్కడ మొత్తం 463,000 వాహనాలను రీకాల్ చేయడం జరిగింది. ముఖ్యంగా తమ కస్టమర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు నిసాన్ కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.ఇక నిస్సాన్ రీకాల్ చేసిన కార్లలో 2008 నుండి 2011 దాకా కొన్ని ఫ్రాంటియర్ ఫ్లాగ్‌షిప్‌ కార్లు ఉన్నాయి. రీకాల్ చేసిన వాహనాల్లో టైటాన్, ఎక్స్‌టెర్రా, పాత్‌ఫైండర్ ఇంకా ఆర్మడ SUV వంటి మోడళ్లు ఉన్నాయి.ఇంకా అలాగే దీనితో పాటు, కంపెనీ 2008 , 2009 క్వెస్ట్ మినీవ్యాన్‌లను కూడా రీకాల్ చేయడం జరిగింది. కంపెనీ కార్లలో ఉపయోగించిన దాదాపు 11,000 స్పేర్ పార్ట్ లను కూడా రీకాల్ చేసింది.ఇక కంపెనీ తరపున సమాచారం ఇస్తూ, ఈ లోపాల వల్ల ఎవరైనా గాయపడవచ్చని సమాచారం తెలిపింది.


 అందుకే నిసాన్ కంపెనీ ఇలాంటి నిర్ణయం తీసుకుంది.ఇక కారు సర్వీసింగ్‌ను మాత్రం కంపెనీ ఇంకా ప్రారంభించలేదు. దీని గురించి ఏప్రిల్‌ నెలలో వినియోగదారులకు మెయిల్ ద్వారా సమాచారం తెలియనుంది. అయితే ఇక సర్వీసింగ్ కోసం వెళ్ళవలసి వచ్చినప్పుడు. వారు డీలర్‌ ద్వారా ఈ లోపాలను సరిదిద్దే సదుపాయాన్ని కంపెనీ కల్పించనుంది.ఇక నిస్సాన్ రెనాల్ట్‌తో కలిసి ఇండియన్ మార్కెట్‌ లో తన ముద్రను మరింత బలంగా వేసుకునేందుకు ప్లాన్స్ జరుపుతోంది. అందులో భాగంగా రెండు కంపెనీలు కూడా పరస్పర భాగస్వామ్యంతో మొత్తం 6 కొత్త మోడళ్లను తీసుకురాబోతున్నాయి. వీటిలో 4 కొత్త C సెగ్మెంట్ SUVలు ఇంకా అలాగే రెండు కొత్త A సెగ్మెంట్ ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి. ఇందులో రెండు కంపెనీల నుంచి మొత్తం మూడు మోడల్స్ ఉన్నాయి. ఇంకా ఈ గ్లోబల్ మాడ్యూల్స్ ఫ్యామిలీ ప్లాట్‌ఫారమ్ ఆధారితంగా ఉంటాయి. చెన్నైలోని కంపెనీల ప్లాంట్లలో దేశీయ స్థాయిలో వీటిని డెవలప్ చేయనున్నారు. ఈ కొత్త ప్రాజెక్టులో కంపెనీ మొత్తం రూ.5,300 కోట్ల డబ్బుని ఇన్వెస్ట్ చెయ్యనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: