సంగారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం అల్మాస్ పుర గ్రామం లో ఆరేళ్ల చిన్నారిపై అధికార పార్టీ సర్పంచ్ భర్త అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. కాగా చిన్నారి కుటుంబాన్ని తాజాగా మంత్రి కేటీఆర్ పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని కెసిఆర్ హామీ ఇచ్చారు. హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను కుటుంబ సభ్యులను కేటీఆర్ ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు.

సమాజంలో ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. నిందితుడు ఎవరైనా కఠిన శిక్ష పడాల్సిందేనని కేటీఆర్ అన్నారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని పాపకి అవసరమైన మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి వైద్యులకు కేటీఆర్ సూచించారు. ఇదిలా ఉండగా నిందితుడు టీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్త కావడంతో ప్రతిపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి. కేటీఆర్ తో నిందితుడు దిగిన ఫోటోను కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే టిఆర్ఎస్ పార్టీ నుండి నింధితున్ని సస్పెండ్ చేసిన సంగతి కూడా తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: