ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు అండగా నిలవాల్సింది పోయి... పరిహారంలో వాటాలు తీసుకున్న ఘనత వైసీపీ నేతలదని జనసేన నేత నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూలిపాళ్లలో ఇవాళ జనసేన కౌలురైతు భరోసా యాత్ర జరగనుంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొనే ఈ కార్యక్రమం ఏర్పాట్లను మనోహర్ పరిశీలించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న 280మంది రైతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున పరిహారం అందిస్తామని మనోహర్ అన్నారు. రైతుల్లో  భరోసా నింపే కార్యక్రమానికి పోలీసులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.


పల్నాడు ప్రాంతంలో ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నందున ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నామని మనోహర్ అన్నారు. బస్సుల్లో వెళ్లొద్దని ఆంక్షలు పెడుతున్నారని నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు. జనసేన నుంచి రూ. లక్ష తీసుకొంటే ప్రభుత్వం ఇచ్చే 7లక్షలు పోతాయని అధికారులు మభ్యపెడుతున్నట్లు నాదెండ్ల మనోహర్‌  తెలిపారు. ప్రభుత్వం నుంచి పరిహారం ఇప్పించామని అందులోని వాటాలు తీసుకున్న చరిత్ర వైసీపీ నేతలదని... అలాంటి వారిని నమ్మొద్దని నాదెండ్ల మనోహర్‌  సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: