తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఓపెన్ అయ్యి చాలా రోజులే అయిపొయింది.. ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ఇప్పటివరకు సినిమా థియేటర్లను ఓపెన్ చేయలేదు. నిర్మాతలు కూడా ఈ టైం లో సినిమా లు రిలీజ్ చేతులు కాల్చుకోవడం ఇష్టం లేక ఊరుకున్నారు.. దీంతో సంక్రాంతికే సినిమాలు వస్తాయని ప్రేక్షకులు అనుకుంటున్నారు. అయితే ఇతర రాష్ట్రాల్లో మాత్రం సినిమా లు రిలీజ్ చేస్తున్నారు. తమిళనాడులో దీపావళి పండగ సందర్భంగా సగం కెపాసిటీతోనే బిస్కోత్ లాంటి కొత్త మూవీస్ ని రిలీజ్ చేసి ప్రేక్షకులను రప్పించుకోవడంలో సక్సెస్ అయ్యారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆ ధైర్యం ఎవరు చెయ్యట్లేదు..