ప్రభాస్ హీరోగా, డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో వస్తున్న పాన్ ఇండియా చిత్రం రాజా సాబ్. ఈ చిత్రం జనవరి 9వ తేదీన విడుదల కాబోతోంది. ప్రభాస్ కి జోడిగా నిధి అగర్వాల్, మాళవికా మోహన్, రిద్దీ కుమార్ నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని హర్రర్ థ్రిల్లర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కించారు డైరెక్టర్ మారుతి. సినిమాకి సంగీతాన్ని థమన్ అందించారు. ట్రైలర్ తోపాటు, సాంగ్స్ విడుదల చేయగా అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఈ సినిమా రిలీజ్ సమయం దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం కూడా ప్రమోషన్స్ ని మరింత వేగవంతం చేస్తున్నారు.


ఈ మేరకు మేకర్స్ హైదరాబాదులో భారీ ఎత్తున ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వహించడానికి సిద్ధమయ్యారు. ఈవెంట్ కి ప్రభాస్ కూడా హాజరు కాబోతున్నారు. డిసెంబర్ 27న భారీ ఎత్తున ఈవెంట్ చేస్తున్నారు. అయితే మొదట ఈవెంట్ ఎల్బీ స్టేడియంలో చేయాలనుకున్నప్పటికీ అనుమతులు లభించకపోవడంతో రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించేలా ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు అక్కడ కూడా కాదని ఈవెంట్ ని సిటీలోని కైతలపూర్ గ్రౌండ్ లో నిర్వహించబోతున్నట్లు వినిపిస్తున్నాయి. ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకే ప్లేస్ మార్చినట్లుగా వినిపిస్తోంది.


ఈవెంట్లో మరొక ట్రైలర్ ని కూడా రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అందుకు సంబంధించి కూడా ఏర్పాటు జరిగినట్లు సమాచారం. గతం లో వచ్చిన ట్రైలర్లో ప్రభాస్ వింటేజ్ వైబ్ తో అభిమానులను ఖుషీ చేశారు. ఇప్పుడు మరి సెకండ్ ట్రైలర్ సినిమా పైన ఎలాంటి అంచనాలను క్రియేట్ అయ్యేలా చేస్తాయో చూడాలి మరి. ఈ ట్రైలర్ తోనే  సినిమాకి భారీ హైప్ ఏర్పడేలా డైరెక్టర్ మారుతి ప్లాన్ చేసినట్లుగా వినిపిస్తోంది. మొదటిసారి ప్రభాస్ ఇలాంటి విభిన్నమైన జోనర్లో కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఫౌజి, స్పిరిట్ వంటి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు ప్రభాస్.

మరింత సమాచారం తెలుసుకోండి: