దేశం మొత్తం కరోనాతో నానా కష్టాలు పడుతున్నారు.. ఇప్పుడు చంద్రబాబు మాత్రం హైదరాబాద్ లో ఉంటూ శవరాజకీయాలు చేస్తున్నారని మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఈ మంత్రి ఇంత చదివారు.. ఆ మంత్రి అంత చదివారని మా ఎడ్యూకేషన్ గురించి ప్రస్తావిస్తున్నారు. ఆరోగ్య శాహా మంత్రిగా ఆళ్ల నాని ఎక్కడైనా ఫెయిల్ అయితే.. అన్ని రాష్ట్రాల్లో కన్నా వెనుక బడిపోయి టెస్ట్ లు చేయలేక.. కరోనాని అదుపు చేయలేక పాజిటీవ్ కేసులు ఉన్నవారు వచ్చి రాష్ట్ర పరిస్థితి తలకిందులైతే ఆ మంత్రి ఫెయిల్ అయ్యారనో.. లేదా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతకాలేదనో... మాట ఎక్కడైనా వినిపిస్తుందా అని ప్రశ్నించారు.  సలహాలూ.. సూచనలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రతిపక్ష నేతగా ఆయనకు ఎంతో బాధ్యత ఉన్నా.. హైదరాబాద్ నుంచి మానిటరింగ్ చేస్తున్నారని అన్నారు. 

 

ఇవన్నీ పక్కన బెట్టి దేశంలో కోవిడ్ ని కట్టడి చేయడంలో ఏపి నెంబర్ వన్ గా ఉందని ఢిల్లీ నేతలకే ఖితాబు ఇచ్చారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు అధికారులతో ముఖ్య నేతలతో ఎప్పటికప్పుడు కమిటీలు వేసి జిల్లా పరంగా.. నియోజక వర్గ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ప్రతిరోజూ ముఖ్యమంత్రి గారు ఆరోగ్య శాఖ మత్రి సీఎస్, డీజీపీ ఇతర ఐఎఎస్ అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసి రాష్ట్ర పరిస్థితులపై సమగ్ర సమాచారాన్ని తెలుసుకుంటున్నారు.

 

ఎంత ఎక్కువ మందికి టెస్టులు చేయగలం.. రెడ్ జోన్ లో ఉన్నవారికి ప్రజలు బయటకు రాకుండా వారికి నిత్యావసర వస్తువులు ప్రతిదీ మనమే ఇంటికి తీసుకు వెళ్లి డోర్ డెలివరీ ఇవ్వాలని అధికారులకు సూచించారు.  రాష్ట్రాల్లో కరోనాని ఎలా అరికట్టాలో అన్ని విధాల కృషి చేస్తున్నారు సీఎం జగన్.  చేసేది ఇందా చెప్పుకునేది కొండంత అనేది మీ మనస్థత్వం.. చంద్రబాబు మీకు పబ్లిసిటి పిచ్చి బాగా ఉంది.. కానీ సీఎం జగన్ కి పబ్లిసిటి పిచ్చి లేదు.. చెప్పిందే చేస్తారు... చేసేదే చెబుతారని అన్నారు మంత్రి కొడాలి నాని. 

మరింత సమాచారం తెలుసుకోండి: